
ys jagan mohan reddy
Ys Jagan : ఇటీవలే ఏపీలో మున్సిపాలిటీ మరియు కార్పోరేషన్ లకు ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో వైకాపా సంచనల విజయాన్ని సొంతం చేసుకుంది. 99 శాతం మున్సిపాలిటీలు మరియు నూరు శాతం కార్పోరేషన్ లను గెలుచుకుంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పరిపాలన సౌలభ్యం కోసం అన్నట్లుగా మున్సిపాలిటీల్లో ఒక మున్సిపల్ చైర్మన్ తో పాటు ఇద్దరు వైస్ చైర్మన్ లను నియమించే జీవోను తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో ఒక చైర్మన్ మరియు ఒక వైస్ చైర్మన్ ఉండేవారు. కాని ఇకపై ప్రతి మున్సిపాలిటీలో కూడా చైర్మన్ మరియు ఇద్దరు వైస్ చైర్మన్ లు ఉండబోతున్నారు. అలాగే కార్పోరేషన్ లో కూడా ఒక మేయర్ మరియు ఇద్దరు డిప్యూటీ మేయర్ లు ఉండబోతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంను పార్టీ నాయకులు స్వాగతించారు. త్వరలోనే ఈ నిర్ణయం ను ఆర్డినెన్స్ రూపంలో తీసుకు రాబోతున్నారు.
ys jagan mohan reddy
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనతో అధికారులు ఆర్డినెన్స్ ను రెడీ చేస్తున్నారు. గవర్నర్ ఈ ఆర్డినెన్స్ కు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. గవర్నర్ ఆమోద ముద్ర పడ్డ వెంటనే కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ కౌన్సిలర్ లు చైర్మన్ మరియు వైఎస్ చైర్మన్ లను ఎంపిక చేసుకోబోతున్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మరింత పారదర్శకంగా పనులు జరగడంతో పాటు స్పీడ్ గా పనులు జరుగుతాయని ఈ సందర్బంగా వైకాపా నాయకులు అంటున్నారు. అనుభవం తక్కువ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అన్న వారు ఇప్పుడు ఏం అంటారని వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. త్వరలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధానం తీసుకు వస్తారేమో చూడాలి.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.