Fish Curry Recipe
Fish Curry Recipe ; ఈరోజు చేపల పులుసుని పర్ఫెక్ట్ గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం.. చాలా చాలా ఈజీ మెథడ్. పర్ఫెక్ట్ ట్రెడిషనల్ రెసిపీ కూడా ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్ లో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ వస్తుందండి. చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు : చేప ముక్కలు, ధనియాలు, మెంతులు, ఎల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, ఉప్పు, కారం, నూనె, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మొదలైనవి…
తయారీ విధానం : ఈ రెసిపీ లోకి నేను యూస్ చేస్తున్న చేప వచ్చేసి శీలావతి ఈ చేపని ఒకటి కంప్లీట్ గా తీసుకొని పీసెస్ లా కట్ చేయించిన తర్వాత తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి. దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీస్పూన్ దాకా మెంతులు. వీటన్నిటిని కూడా వేసేసిన తర్వాత ఫైన్ గా పౌడర్ చేసుకోండి. పచ్చి ఎల్లిపాయలు వేసుకొని ముద్దలా ఫేస్టు చేసుకోవాలి. మసాలా ముద్దను తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి 50 గ్రాముల చింతపండును తీసుకొని చింతపండు మునిగేటట్టుగా నీళ్ళు పోసేసి చింతపండు నానేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చింతపండు పులుసు మొత్తాన్ని కూడా పిండుకుని తీసుకోవాలి. ఎంత వీలైతే అంత నీళ్లు వేసేసి తిప్పి అంత వచ్చేసే అంతవరకు కూడా బాగా పిండేసి చింతపండు రసాన్ని తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి.
Fish Curry Recipe
అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఆడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లో వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాన్ని తీసుకుని ఆ టమాటా ప్యూరిని కూడా వేసేసేయండి. ఒక టేబుల్ స్పూన్ దాక కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇలా గ్రేవీ లోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి. మసాలా ఆయిల్ లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసేసేయాలి. చింతపండు రసం వేసి కొద్దిసేపు పొంగు వచ్చేలాగా ఉడికించండి. వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాల పాటు పులుసుని మరిగించండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఒక్కసారి ఈ పులుసు టేస్ట్ చూసుకోండి. మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పులుసులోకి మునిగేటట్టుగా గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఉడికించాలి.తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని రెండూ లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని గిన్నెని గరిట పెట్టకుండా ఒకసారి కుదుపుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి దేనికి పక్కన పెట్టుకోవాలి. చేసిన రోజు కాకుండా మరుసటి రోజు తింటేనే టేస్ట్ బాగుంటుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు… అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది..
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.