
Ramadan : రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ గంజి...ఎలా తయారు చేస్తారంటే...!
Ramadan : ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నెలరోజుల పాటు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్…ఇక ఈ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులందరూ నెల రోజులపాటు రోజా ఉంటారు. ఈ పండుగలో రోజా అనేది ప్రధానమైనది. రోజా అంటే ఉపవాసం అని అర్థం. ఇక ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా తప్పకుండా రోజా పాటిస్తూ , వారి దేవుని ఆరాధిస్తూ ,ఖురాన్ చదవడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ పండుగ సమయంలో ఎక్కువ శాతం ముస్లింలు అందరూ కూడా మసీదులోనే గడుపుతూ కనిపిస్తారు. అలాగే ఈ పండుగ సందర్భంలో ముస్లిం మత పెద్దలు కూడా మసీదుల్లోనే ప్రార్థనలు చేయాల్సిందిగా అందరికీ చెబుతుంటారు. అయితే ఈ రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనది ఉపవాసం అని చెప్పాలి. ఇక ఈ ఉపవాసం ముగిసిన తర్వాత వారంతా కలిసి మసీదుల్లో ప్రార్థన ముగించిన తర్వాత ప్రత్యేకించి గంజినే ఆహారంగా తీసుకుంటారు.
రంజాన్ నెలలో మాత్రమే తయారు చేసే ఈ గంజికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాక చాలా ప్రాంతాలలో ఇఫ్తార్ సమయంలో పండ్లు అల్పాహారం లేకపోయినా సరే గిన్నె గంజి అయినా తప్పక తాగాలని సూచిస్తుంటారు. అయితే ఈ గంజిని చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకుని తాగుతారు. మరి రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గంజిని అసలు ఎలా తయారు చేస్తారు… దానిని తాగడం వలన కలిగే లాభాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం…. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ గంజిని బియ్యం రవ్వ లేదా బొంబాయి రవ్వతో తయారు చేస్తారు. అలాగే దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి ,యాలకులు , లవంగాలు దాల్చిన చెక్క , నెయ్యి వంటి పదార్థాలను కూడా ఉపయోగిస్తారు.. అయితే ఈ గంజి తయారీకి ముందుగా మసాలా దినుసులు అన్నిటిని నెయ్యిలో వేయిస్తారు. అనంతరం ఒక పెద్ద వంట పాత్ర లో నీళ్ళు పోసి బాగా మరగనిస్తారు. నీరు బాగా మరిగిన తర్వాత దీనిలో రవ్వను కలుపుతూ ముందే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ,సరిపడా ఉప్పు వేసి గంజి చిక్కబడేలా ఉడకనిస్తారు.
Ramadan : రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ గంజి…ఎలా తయారు చేస్తారంటే…!
ఈ విధంగా తయారుచేసిన గంజిని అందరికీ పంపిణీీ చేస్తారు. ఇక ఈ గంజిలో కొందరు బూందీ వేసుకుని తినడానికి చాలా ఇష్టపడతారు. మరి కొన్ని చోట్ల ఈ గంజి తయారీకి కొంతమంది ముస్లింలు ఖీమా కూడా వినియోగిస్తారు. అయితే ఉపవాస దీక్షపరుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ గంజిని మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇష్టపడతారని చెప్పాలి. ఇక రంజాన్ నెలలో సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ అని పిలవబడే ప్రార్ధనలో పలు రకాల ఆహార పదార్థాలతో వారి యొక్క ఉపవాసాన్ని విరమిస్తారు. వాటిలో ముందుగా ఖర్జూరం నీరు లేదా పాలతో వారి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఖర్జూరం లేదా నీరు తీసుకున్న తర్వాతే వారి భోజనాన్ని స్వీకరిస్తారు. ఈ రంజాన్ మాసం అంతా ఉపవాసం దీక్ష చేసిన తర్వాత చివరి రోజున. ఈద్-ఉల్-ఫితర్ పండుగను రంజాన్ పండుగగా జరుపుకుంటారు.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.