Ramadan : ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నెలరోజుల పాటు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్…ఇక ఈ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులందరూ నెల రోజులపాటు రోజా ఉంటారు. ఈ పండుగలో రోజా అనేది ప్రధానమైనది. రోజా అంటే ఉపవాసం అని అర్థం. ఇక ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా తప్పకుండా రోజా పాటిస్తూ , వారి దేవుని ఆరాధిస్తూ ,ఖురాన్ చదవడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ పండుగ సమయంలో ఎక్కువ శాతం ముస్లింలు అందరూ కూడా మసీదులోనే గడుపుతూ కనిపిస్తారు. అలాగే ఈ పండుగ సందర్భంలో ముస్లిం మత పెద్దలు కూడా మసీదుల్లోనే ప్రార్థనలు చేయాల్సిందిగా అందరికీ చెబుతుంటారు. అయితే ఈ రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనది ఉపవాసం అని చెప్పాలి. ఇక ఈ ఉపవాసం ముగిసిన తర్వాత వారంతా కలిసి మసీదుల్లో ప్రార్థన ముగించిన తర్వాత ప్రత్యేకించి గంజినే ఆహారంగా తీసుకుంటారు.
రంజాన్ నెలలో మాత్రమే తయారు చేసే ఈ గంజికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాక చాలా ప్రాంతాలలో ఇఫ్తార్ సమయంలో పండ్లు అల్పాహారం లేకపోయినా సరే గిన్నె గంజి అయినా తప్పక తాగాలని సూచిస్తుంటారు. అయితే ఈ గంజిని చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకుని తాగుతారు. మరి రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గంజిని అసలు ఎలా తయారు చేస్తారు… దానిని తాగడం వలన కలిగే లాభాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం…. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ గంజిని బియ్యం రవ్వ లేదా బొంబాయి రవ్వతో తయారు చేస్తారు. అలాగే దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి ,యాలకులు , లవంగాలు దాల్చిన చెక్క , నెయ్యి వంటి పదార్థాలను కూడా ఉపయోగిస్తారు.. అయితే ఈ గంజి తయారీకి ముందుగా మసాలా దినుసులు అన్నిటిని నెయ్యిలో వేయిస్తారు. అనంతరం ఒక పెద్ద వంట పాత్ర లో నీళ్ళు పోసి బాగా మరగనిస్తారు. నీరు బాగా మరిగిన తర్వాత దీనిలో రవ్వను కలుపుతూ ముందే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ,సరిపడా ఉప్పు వేసి గంజి చిక్కబడేలా ఉడకనిస్తారు.
ఈ విధంగా తయారుచేసిన గంజిని అందరికీ పంపిణీీ చేస్తారు. ఇక ఈ గంజిలో కొందరు బూందీ వేసుకుని తినడానికి చాలా ఇష్టపడతారు. మరి కొన్ని చోట్ల ఈ గంజి తయారీకి కొంతమంది ముస్లింలు ఖీమా కూడా వినియోగిస్తారు. అయితే ఉపవాస దీక్షపరుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ గంజిని మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇష్టపడతారని చెప్పాలి. ఇక రంజాన్ నెలలో సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ అని పిలవబడే ప్రార్ధనలో పలు రకాల ఆహార పదార్థాలతో వారి యొక్క ఉపవాసాన్ని విరమిస్తారు. వాటిలో ముందుగా ఖర్జూరం నీరు లేదా పాలతో వారి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఖర్జూరం లేదా నీరు తీసుకున్న తర్వాతే వారి భోజనాన్ని స్వీకరిస్తారు. ఈ రంజాన్ మాసం అంతా ఉపవాసం దీక్ష చేసిన తర్వాత చివరి రోజున. ఈద్-ఉల్-ఫితర్ పండుగను రంజాన్ పండుగగా జరుపుకుంటారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.