Viral News : మనుషులలో మానవత్వం చచ్చిపోతుంది. ఒకరిపై ఒకరు పగ, ప్రతికారాలు పెంచుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి చంపుకునేంత వరకు పోతున్నారు. క్షణికా ఆవేశమో, ఇతర కారణాలో తెలియదు కానీ.. ఈ తరం మనుషుల్లో మానవత్వం మచ్చుకైన కనపడకపోవడం బాధాకరం. భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, ఫ్రెండ్స్ ఇలా చాలా మంది మధ్య ప్రేమ, ఆప్యాయతలు కొరవడుతున్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి టైంకి అన్నం వండలేదనే కారణంతో స్నేహితులు అతడిని చంపిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. చిన్న కారణంతో ఓ వ్యక్తిని చంపడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
వివరాలలోకి వెళితే హైదరాబాద్ జీడీమెట్లలో అన్నం వండలేదనే కారణంతో 38 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు కొట్టి చంపారు. మృతుడిని రాజస్థాన్ కు చెందిన హన్స్ రామ్ అని తెలుస్తుంది. అతను గతంలో కుత్భుల్లాపూర్లో అద్దెంట్లో ఉండేవాడు. అయితే మద్యానికి బాగా బానిసైన అతను రోజూ తాగి వచ్చి భార్యని హింసించేవాడు. అయితే ఆ బాధని భరించలేక ఆమె తన తల్లి వద్దకు వెళ్లింది. ఇక భార్య వెళ్లిపోయిన క్రమంలో హన్స్రామ్ ఇల్లు ఖాళీ చేసి స్నేహితుడు బినయ్ సింగ్ ఇంట్లో ఉంటున్నా డు. స్థానిక గ్రానైట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్న బినయ్ సింగ్ తనతో పాటు జీడిమెట్లలో ఉండమని చెప్పడంతో కొద్ది రోజులుగా కలిసి ఉంటున్నారు.
పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన స్నేహితులు వచ్చే సరికి అన్నం ఎందుకు వండలేదంటూ బినయ్ సింగ్పై దాడి చేశారు. హన్స్రామ్ ని చావబాదారు. ఈ క్రమంలో అతను మరణించాడు కూడా. అయితే నిందితులు వచ్చేసి బీహార్ కు చెందిన సోనూ తివారీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన సందీప్ కుమార్ అని తెలుస్తుంది. వారు అతని సహోద్యోగులుగా పోలీసులు గుర్తించారు.. ఈ ఘటన తర్వాత బినయ్ సింగ్ తన యజమానికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులు దాడి తర్వాత అక్కడి నుండి పారిపోయారు. అయితే తాజా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.