Hibiscus Tea : అధిక బరువు అనేది శరీరంలో పేరుకు పోయిన కొవ్వు వల్లే అనే విషయం తెల్సిందే. శరీరంలోని కొవ్వు కరిగించడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు పొట్ట కూడా నార్మల్ గా అవుతుంది. అందుకే బరువు తగ్గడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు కష్టపడి ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆహారం విషయంలో కాస్త ఆంక్షలు పాటిస్తూ ఉంటారు. ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా కొందరు లావు తగ్గడం జరగదు. అలాంటి వారి కోసం మందార టీ అద్బుత ఔషదం అంటూ నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు మందార పువ్వు తో తయారు చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉన్న వృదా కొవ్వు అంతా కరిగిస్తుంది. మందారంలో ఉన్న పాలీఫినాల్స్, ఆంథోసయనిన్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని కొవ్వుపై అధికంగా ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ గా మాందారం టీ తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయి ఉన్న కొవ్వును తొలగించడంతో పాటు కొత్తగా కొవ్వు పేరుకు పోకుండా చూసుకుంటుంది. పెద్ద పేగులో ఉండే కొవ్వు పదార్థాలను క్లీన్ చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ పనిని మందార పువ్వు టీ చేస్తుంది.
మందార పూలను బాగా ఎండబెట్టి తొడిమె తొలగించి భద్రపర్చుకోవాలి. 500 ఎంఎల్ నీటిని తీసుకుని వేడి చేసి అందులో 50 గ్రాముల ఎండు మందార పువ్వులను వేయాలి. కనీసం పది నిమిషాల పాటు మరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఆ నీటిని చల్లార్చి తాగేయాలి.
రుచి కోసం చెక్కర కాకుండా రెండు టీ స్పూన్ ల తేనెను వేసుకోవాలి. తేనె అందుబాటు లో లేకుంటే బెల్లం అయినా పర్వాలేదు. 500 ఎంఎల్ మందార పూల టీ ని రోజులో మూడు లేదా నాలుగు సార్లు తాగితే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడుతుంటే మరెందుకు ఆలస్యం వెంటనే మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.