AC Facts : ఏసీ ఎక్కువగా వాడే వారికి కంటి సమస్యలు వస్తాయా… ఇందులో నిజమెంత, తెలుసుకోండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AC Facts : ఏసీ ఎక్కువగా వాడే వారికి కంటి సమస్యలు వస్తాయా… ఇందులో నిజమెంత, తెలుసుకోండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2025,1:00 pm

AC Facts : వేసవి కాలంలో ఏసీలని ఎక్కువగా వినియోగిస్తుంటారు. AC ని ఎక్కువగా వాడడం వలన, కళ్ళు మండడం, దురద, డ్రై ఐ సిండ్రోమ్ సమస్యలు వస్తాయి. పరిస్థితికి పరిష్కారం హ్యూమిడిఫైయర్ వాడటం, కళ్ళు మూసుకుపోవడం. నీళ్లు తాగడం, లూబ్రికేటింగ్ ఐ డ్రాప్ వాడటం మంచిది.రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకొనుటకు ఇళ్లల్లో ఏసీలను ఆన్ చేసుకొని తప్పించుకోవడానికి దీని వాడకం పెరిగింది. ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ, కార్లలోను, ఏసీలు లేనిది ఉండనే ఉండరు. ఆన్ లో ఉన్నప్పుడు మీ కళ్ళు మండుతున్నట్లు అనిపించిందా.. మీ కళ్ళు, మంటగా,దురదగా ఉన్నాయా. లేదా నిరంతరం కళ్ళను రుద్దుకోవాల్సి వస్తుందా. చాలామంది ఇది అలసట లేదా కంప్యూటర్ స్క్రీన్ లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల అని అనుకుంటారు. దీని వెనుక ప్రధాన కారణం ఏసీనే అట.

AC Facts : బయట చాలా వేడిగా ఉంటే

బయటనుంచి ఆఫీసులోనికి అడుగుపెట్టగానే వెంటనే ఏసీ ని ఆన్ చేస్తారు. ఈ చల్లని గాలి కొంతసేపు హాయిగా అనిపిస్తుంది. కోన్ని గంటలు గడిచిన తరువాత కళ్ళు అలసిపోతున్నట్లు అనిపిస్తుంది. కొంతమంది కళ్ళల్లో నీళ్లు కారుతాయి. మరికొందరికి ఒక మంచు కనిపిస్తుంది. దీనికి గల కారణం డ్రై ఐ సిండ్రోమ్. ఏసీ నిరంతరం నడుస్తూ ఉండడం వల్ల గాలి నుండి తేమ గ్రహించబడుతుంది. అంటే,వాతావరణం పొడిగా మారిపోతుంది.

AC Facts ఏసీ ఎక్కువగా వాడే వారికి కంటి సమస్యలు వస్తాయా ఇందులో నిజమెంత తెలుసుకోండి

AC Facts : ఏసీ ఎక్కువగా వాడే వారికి కంటి సమస్యలు వస్తాయా… ఇందులో నిజమెంత, తెలుసుకోండి…?

గాలిలో తేమ తగ్గినప్పుడు, కళ్ళల్లో సహజంగా ఉత్పత్తి అయ్యే కన్నీళ్లు త్వరగా ఆవిరైపోతాయి. ఫలితంగా, కళ్ళు పొడిగా మారుతాయి. దీనికి పరిష్కారాలు ఏమిటి : ఏసీ గదుల్లో ఫ్యూమిడీపైయర్, ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు కళ్ళు మూసుకోండి. బాగా నీళ్లు తాగండి. ప్రిజర్వేటివ్ లేని లూబ్రికేటింగ్ ఐ డ్రాప్ వాడండి. వీలైతే, ఏసీ ఉష్ణోగ్రత పరిమితిని 24 నుంచి 26 డిగ్రీ సెంటీగ్రేట్ వద్ద ఉంచండి. ఈ నియమాలను పాటిస్తే మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది