Gular Indian Fig : ఈ పండులో పురుగులు ఉన్నాయని పడేయకండి… ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gular Indian Fig : ఈ పండులో పురుగులు ఉన్నాయని పడేయకండి… ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం…?

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :29 May 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Gular Indian Fig : ఈ పండులో పురుగులు ఉన్నాయని పడేయకండి... ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం...?

Gular Indian Fig : ప్రస్తుత కాలంలో ప్రజలు ఈ పండుని తేలిగ్గా తీసుకొనిస్తున్నారు.పురుగులు ఉంటాయి అని చెప్పి తినడమే మానేస్తున్నారు. ఇప్పటి పిల్లలకు ఈ పండు గురించి అసలు తెలియదు. పండులోని పురుగులు చూసి అసహ్యించుకుంటారు.ఈ పండులో పురుగులు ఉన్నా కానీ ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం అంటున్నారు నిపుణులు. ఈ పండు పేరు ఏమిటో తెలుసా.. అదేనండి, మేడిపండు.మేడి పండు చూడు,మేలిమై ఉండును.పొట్ట దుప్పి చూడు, పురుగులుండును. అనే సామేత ఇప్పటికీ వింటూనే ఉన్నాం. ఈ మేడిపండు చూడడానికి అచ్చం అంజీర పండు లాగానే ఉంటుంది. కానీ, మేడిపండును విప్పి తినకూడదు. ఎందుకంటే,మేడిపండు లో పురుగులు ఉంటాయి. కానీ, మేడిపండును ఒక సూపర్ ఫుడ్డు గా అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. మేడిపండును తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని ఉంటాయని అంటున్నారు నిపుణులు.మరి ఈ మేడిపండీ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Gular Indian Fig ఈ పండులో పురుగులు ఉన్నాయని పడేయకండి ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం

Gular Indian Fig : ఈ పండులో పురుగులు ఉన్నాయని పడేయకండి… ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం…?

Gular Indian Fig  మేడిపండు

మేడిపండు.. హైబ్రిడ్ రకాలను అత్తిపండు అని కూడా పిలుస్తారు. పండు చూడడానికి గుండ్రంగా ఆకారాన్ని కలిగి ఉంటుంది. పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగాను, లేదుగా ఉందో మేడిపండు పండిన తరువాత పసుపు రంగులోకి లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఈ మేడిపండు రుచి తియ్యగా ఉంటుంది. అయితే, నాటు పండు అయినా, మేడిపండులో పురుగులు ఉంటాయి.

మేడిపండు ఆరోగ్య ప్రయోజనాలు : మేడిపండ్లు, ఆకులు, బెరడు,వేర్లు ఔషధ సంపదగా పరిగణిస్తారు. ప్రజలు కరోనా అనంతరం మేడిపండును, దాని కాండం, ఆకులు,పండ్లను విస్తృతంగా వినియోగించారు. ఈ చెట్టు పండ్లు, ఆకులు, బెరడులో అన్ని అంటూ వ్యాధులతో పోరాడే గొప్ప శక్తిని కలిగి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మేడిపండు లోని పోషకాలు : మేడి పండులో విటమిన్లు, ఖనిజాలు,ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి మేడిపండు చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మేడిపండు దివ్య ఔషధం. గుండె జబ్బులకు మేడిపండు మంచిదని చెప్పవచ్చు. ఇంకా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కర స్థాయిలను శక్తి కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కడుపునొప్పి ఉన్నవారికి నాలుగు పండిన మేడికొండను తినిపిస్తే, క్షణమే ఉపశమనం కలుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
మేడిపండులో పురుగులు ఉండటం సర్వసాధారణం. అయితే, కొన్ని రకాల పురుగులే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన మేడిపండును తినే విషయంలో మేడిపండు తినేటప్పుడు జాగ్రత్తగా పురుగుల్ని తీసి ఆ తరువాత తినండి. అన్నం తినే క్రమంలో పురుగులు ఉన్నాయా లేదా చూసి అవి తీసేసి ఆ తర్వాత తినాలి. ప్రయోజనాలు పుష్కలంగా కలిగి ఉన్న ఈ పండు తింటే మెగ్నీషియం శరీరానికి అందుతుంది. ఈ పండులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
మేడిపండు తింటే శరీరానికి కావాల్సిన అద్భుతమైన శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మేడిపండు తింటే వయసు పైబడిన లక్షణాలు, వృద్ధాప్య ఛాయలు త్వరగా రావని అంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, గొంతు నొప్పి,మంట, విరేచనాలు నయం చేయటానికి కూడా ఈ మేడిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

Also read

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది