Pindi Kura : ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు… కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pindi Kura : ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు… కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి…!

Pindi Kura : మన ఆరోగ్యం కోసం తరచుగా ఆకుకూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆకు కూరలలో ఎక్కువగా ఖనిజ పోషకాలు మరియు ఇనుము దాతువును కలిగి ఉంటాయి. మన శరీరంలో ఐరన్ లోపం ఉండటం వలన అనిమీయాతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ప్రతినిత్యం మీరు తీసుకునే ఆహారంలో ఈ ఆకుకూరలను చేర్చుకోవటం చాలా అవసరం. దీనివలన అనీమియాను తగ్గించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు అని అంటున్నారు నిపునులు. ఈ ఆకుకూరలలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Pindi Kura : ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు... కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి...!

Pindi Kura : మన ఆరోగ్యం కోసం తరచుగా ఆకుకూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆకు కూరలలో ఎక్కువగా ఖనిజ పోషకాలు మరియు ఇనుము దాతువును కలిగి ఉంటాయి. మన శరీరంలో ఐరన్ లోపం ఉండటం వలన అనిమీయాతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ప్రతినిత్యం మీరు తీసుకునే ఆహారంలో ఈ ఆకుకూరలను చేర్చుకోవటం చాలా అవసరం. దీనివలన అనీమియాను తగ్గించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు అని అంటున్నారు నిపునులు. ఈ ఆకుకూరలలో కాల్షియం, బీటా కెరోటిన్, విటమిన్ సి కూడా అధికంగా ఉన్నాయి. అయితే ఈ ఆకుకూరల వలన వచ్చే కెరోటిన్ అనేది మన శరీరంలో విటమిన్ ఏ గా మారి అందత్వం అనేది రాకుండా చేస్తుంది. దీనిలోని విటమిన్ సి అనేది ఎంతో ఆరోగ్యకరమైన ఎముకలకు మరియు దంతాలకు ఎంతో ముఖ్యమైన పోషకం. ఈ ఆకుకూరలో కొన్ని రకాల విటమిన్లు,బీ కాంప్లెక్స్ ను కూడా కలిగి ఉన్నాయి. పల్లెటూర్లలో ఈ పిండి కూర ఆకులను ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూనే ఉంటాం. ఈ పిండి కూర చెట్టు అనేది మన ఇంటి ముందు లేక మన పెరట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే సంక్రాంతి టైం లో గొబ్బెమ్మలకు రేగి పండ్లు, గరిక, ధాన్యాలతో పాటుగా ఈ పిండి కూర రెక్కలను అలంకరిస్తారు. వీటిని కొండపిండి చెట్టు అని, తెలగపిండి చెట్టు అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ పిండి కూర ఆకులో ఎంతో విశేషమైన గుణం ఉంది అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే ఈ పిండి కూర ఆకును పాషానభేది అని కూడా అంటుంటారు. దీని అర్థం రాళ్లను కూడా కరిగించగలదు అని. ఈ పిండి కూర కిడ్నీలోని రాళ్ళను కూడా కరిగించగల గుణం ఉంది అని అంటున్నారు…

ఈ పిండి కూర మొక్కని వేళ్ళతో సహా వాడుతూ ఉంటారు. దీనికోసం కావలసిన మోతాదులో పిండి కూర ఆకులను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ ఆకులను కట్ చేసుకుని అర లీటర్ వాటర్ లో వేసుకొని మరిగించుకోవాలి. ఈ నీరు అనేది సగానికి మరిగిన తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఈ రసానికి ఒక 30 గ్రాముల పటిక బెల్లాన్ని మరియు రెండు గ్రాముల శిలాజిత్ పొడిని కలుపుకోవాలి. మీరు ఈ మిశ్రమాన్ని ప్రతి నిత్యం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ కషాయాన్ని తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అని నిపుణులు అంటున్నారు. ఇలా గనక మీరు చేసినట్లయితే మూత్రాశయంలో మరియు కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అయితే ఈ పిండి కూర ఆకును వేర్లతో సహా తెచ్చుకొని క్లీన్ చేసుకుని దంచి మెత్తగా చేసుకోవాలి. దీనిని ఒక ముద్ద లాగా చేసుకుని ఒక గుడ్డలో వేసుకొని పిండినట్లయితే దీని నుండి రసం వస్తుంది. ఈ రసానికి సమానంగా పట్టిక బెల్లాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై మరిగించాలి.ఈ మిశ్రమం లేత పాకం వచ్చే వరకు మరిగించాలి. దీని తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని నిలువ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పెద్దవారైతే ఒకటి లేక రెండు చెంచాలు, పిల్లలైతే అర చెంచా ప్రతినిత్యం తీసుకున్నట్లయితే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Pindi Kura ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి

Pindi Kura : ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు… కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి…!

ఈ పిండి కూర ఆకుని ఎంతోమంది కూరగా కూడా చేసుకుని తిట్టుంటారు. ఉల్లిపాయ లేక పప్పులో వేసుకొని వండుకుంటే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ పిండి కూర ఆకుని కూర చేసుకుని తీసుకోవడం వలన మూత్రపిండంలో ఉన్న వ్యర్ధాలు, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీకు ఈ పిండి కూర అందుబాటులో ఉన్నట్లయితే దానిని వేర్లతో సహా ఇంటికి తీసుకొచ్చుకోండి. దీని వేర్లు, ఆకులు,పూలతో సహా ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేయవచ్చు. మీరు ఎప్పుడూ వాడుకునే టీ పొడి కి బదులుగా ఈ పొడిని వేసుకొని టీ లా కూడా తీసుకోవచ్చు. మీరు కొన్ని రోజులపాటు ఇలా చేసినట్లయితే మూత్రశయానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది