Medical Experts about Monkeypox Effect
Monkeypox : గత మూడు సంవత్సరాలుగా ప్రజలను అల్లకల్లోలం చేస్తున్న మహంమారి కరోనా ఈ కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అదేవిధంగా ఎంతో మందిని బలి తీసుకుంది. అలాంటి కరోనా ఇప్పుడు దాని త్రీవత తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలు అమ్మయ్య అని అనుకునే లోపే ఇంకొక మహమ్మారి ప్రజల్లోకి చొరబడింది. ఆ మహమ్మారి పేరు మంకీ పాక్స్.. అయితే ప్రస్తుతం ఈ మంకీ పాక్స్ కేసులు పెరగడంతో జనాలలో మళ్ళీ భయభ్రాంతులు రేకెత్తుతున్నాయి. అయితే ఈ మంకీ పాక్స్ కేసులు కేరళలో అలాగే ఢిల్లీలో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు వరకు ఇండియాలో మంకీ పాక్స్ సోకొనటువంటి వ్యాధిగ్రస్తులు సంఖ్య తొమ్మిదికి చేరుకున్నాయి. అయితే ఈ మహమ్మారితో ఒకరు చనిపోయారు. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంతో కొన్ని చర్యలను మొదలుపెట్టారు. అన్ని రాష్ట్రాలలో ఈ మహమ్మారి వ్యాప్తిని తనిఖీ చేయడానికి కొన్ని సలహాలను వేగవంతం చేసింది.
రోగ నిరోధక శక్తి పెరగడానికి వ్యాక్సిన్ల అధికంగా పర్యవేక్షించేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్ ను రెడీ చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా రెండు ఆగస్టున తెలియజేశారు. అయితే ఐ సి ఎం ఆర్ నేపథ్యంలోని జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. పూణే కొన్ని కేసులు అనుమానిత పర్యవేక్షణలో రిఫరల్ లాబోరెటరీగా పెట్టినట్లు తెలియజేశారు. అదేవిధంగా అధికంగా ఐసిఎంఆర్ వైరల్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ లాబోరేటరీ నెట్వర్క్ లెబోరెటరీలు ఈ మహమ్మారి వ్యాధి లక్షణాలను బయటపెట్టెందుకు ఆప్టిమైజ్ చేశారు. అయితే ఈ మంకీ పాక్స్ ఇంతకుముందు వ్యాపించిన కరోనా తో పోలిస్తే ఈ వ్యాధి పెద్దగా వ్యాప్తి చెందదు. అని చావుల సంఖ్య కూడా తక్కువగా ఉందని ఎవరు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు జనాలకు ధైర్యం చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు వారు ఈ మంకీ పాక్స్ తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకనగా ఈ మంకీ పాక్స్ అనేది ఒక అంటువ్యాధి కాబట్టి దీని నుంచి అధిక ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంటుందని చెప్పారు.
Medical Experts about Monkeypox Effect
అయితే ఈమధ్య కాలంలో కేరళలో చనిపోయిన 22 ఏళ్ల కుర్రాడు గురించి చర్చిస్తే ఆ కుర్రాడు మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ తోనే చనిపోయాడట. అయితే ఆ యువకుడికి బ్రెయిన్ ఎన్స్ పాలిటీస్ కూడా ఉన్నట్లు. ఛవి గుప్తా తెలియజేసారు. అయితే ఇలా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ మంకీ పాక్స్ తో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి అని డాక్టర్ గుప్తా గారు తెలియజేస్తున్నారు.
అయితే ఇంకొక విషయం ఏమిటంటే. ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ మహమ్మారి వైరస్ తో కలిసి న్యూమేనియా ఇన్ఫెక్షన్ ను అభివృద్ధి చేయవచ్చని ఛవి గుప్త పేర్కొన్నారు. అలాగే రోగ నిరోధక శక్తి లేనటువంటి వారు అత్యధిక జ్వరం అలాగే శరీరంపై దద్దుర్లు ఉంటాయి. ఈ వ్యక్తి కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది. అలాగే ఈ వ్యాధిగ్రస్తులు అందువలన ఈ మహమ్మారితో అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ గుప్తా హెచ్చరిస్తున్నారు. దీని లక్షణాలు జ్వరం, ఇబ్బందులు దద్దుర్లు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వైద్యనిపుణులు సంప్రదించి వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలి అని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.