
Pregnancy : ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ చక్కెర పానీయాలు తాగితే... పొట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా...!
Pregnancy : మన ఆరోగ్యానికి చక్కెర పానీయాలు అనేవి ఎంతో ప్రమాదకరం అని మన అందరికీ తెలుసు. అయితే ఈ చక్కెర పానీయాలను తీసుకోవటం వలన దత్త సమస్యలు మరియు బరువు పెరగడం,మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలి వ్యాధులు కూడా వస్తాయి. అలాగే ప్రెగ్నెంట్ టైం లో చక్కెర పానియాలు తాగే మహిళలకు పుట్టబోయే పిల్లలకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని తాజా పరిశోధనలో తేలింది. అయితే పీర్ రీవ్యూడ్ జర్నల్ న్యూట్రియెంట్స్ లో ప్రచురింపబడిన ఒక అధ్యయన ప్రకారం చూసినట్లయితే, ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ మొత్తంలో చక్కెర పానీయాలను తీసుకునే మహిళలు వారిపై మరియు వారికి పుట్టబోయే బిడ్డపై కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతాయి అని అంటున్నారు. అయితే ఈ సర్వే అనేది ఏప్రిల్ మరియు జూన్ 2022, 2023లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వేలో 4,000 మందికి పైగా గర్భిణీ మహిళలు ఉన్నారు. అయితే ఈ సర్వే సందర్భంగా గర్భిణీ మహిళలందరి కి పండ్ల రసం మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్, ఫీజీ డ్రింక్స్, సోడా, జ్యూస్, మిల్క్ డ్రింక్ లాంటివి ఇవ్వడం జరిగింది.
ఈ సర్వే చివరిలో చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకునే మహిళలు ప్రెగ్నెంట్ టైం లో మధుమేహ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అని తేలింది. అయితే ప్రెగ్నెంట్ టైం లో వచ్చే మధుమేహ సమస్య ను జెస్టేషనల్ డయాబెటిస్ అని అంటారు. అయితే ప్రెగ్నెంట్ టైం లో వచ్చిన మధుమేహ విషయంలో పిల్లలు సాధారణ కంటేఎక్కువ బరువు ఉండవచ్చు. దీని కారణం చేత డెలివరీ టైమ్ లో ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది. ఇది మాత్రమే కాక ప్రెగ్నెంట్ మధుమేహం కూడా శిశువు అకాల పుట్టుకకు కామెర్ల సమస్యకు దారితీస్తాయి. ఈ సర్వేలో వారానికి మూడు సార్లు చక్కెర పానీయాలను తీసుకునే మహిళలు ప్రెగ్నెంట్ టైంలో మధుమేహం వచ్చే ప్రమాదం 38 శాతం వరకు అధికంగా ఉన్నట్లు కనుక్కున్నారు. అంతేకాక ఈ మహిళల్లో ప్రెగ్నెంట్ రక్తపోటు ప్రమాదం 64% వరకు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మహిళలు ప్రెగ్నెంట్ టైంలో చక్కెర పానీయలను ఎక్కువగా తీసుకోవడం వలన పిండానికి తగిన రక్తం లభించదు. దీని కారణం చేత పిండం పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని సర్వేలో తేలింది. అంతేకాక అకాల డెలివరీ ప్రమాదం కూడా పెరుగుతుంది…
Pregnancy : ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ చక్కెర పానీయాలు తాగితే… పొట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా…!
ఈ చక్కెర పానీయాలను వారానికి నాలుగు సార్లు తీసుకోవడం వలన మక్రో సోమియా ప్రమాదాలను ఎక్కువగా పెంచుతుంది. అయితే ఈ సర్వే ముగింపులో ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ మొత్తంలో చక్కెర పానీయాలను తీసుకోవడం వలన గర్బదారణ మధుమేహం మరియు గర్భధారణ రక్తపోటు ప్రమాదాలను మరింతగా పెంచుతుంది అని పరిశోధనలో తేలింది. ఇది మాత్రమే కాకుండా మక్రోసోమియా ప్రమాదాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అని అన్నారు. అయితే మహిళలు ప్రెగ్నెంట్ టైం లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మహిళలు తమ ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని అంటున్నారు. అంతేకాక ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాలను గరిష్ట పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం అని పరిశోధకులు అంటున్నారు…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
Laddulu : తెలుగు సంప్రదాయ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నది…
Fruits for Hydration : వేసవి కాలం మొదలైతేనే ఎండల తీవ్రత పెరిగి శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అధిక…
Ugadi astrology, : ఉగాది పండుగతో తెలుగు సంవత్సరానికి శ్రీకారం చుడతారు. కొత్త పంచాంగం ప్రకారం సంవత్సర ఫలితాలను జ్యోతిష్యులు…
This website uses cookies.