Crime News : ఒక ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆ బాధ కొన్నేళ్ల వరకు అలాగే ఆ ప్యామిలీలో ఉంటుంది. తాజాగా అదే జరిగింది. అసలు ఒక ఫ్యామిలీయే నాశనం అయిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చనిపోవడంతో సొంత చెల్లిని బాగా చూసుకోవాల్సింది పోయి.. ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడో తెలిస్తే అతడిని మీరు చంపేస్తారు.
లక్నోలోని సైర్ పూర్ అనే ఏరియాలో హిమాన్షు.. తన చెల్లి, తల్లిదండ్రులతో నివసించేవాడు. అతడు ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. సంవత్సరం క్రితం హిమాన్షు తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో తన సోదరి శివానీతో కలిసి ఉంటున్నాడు. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత హిమాన్షు డ్రగ్స్ కు బానిస అయిపోయాడు. రోజూ డ్రగ్స్ తీసుకొని ఇంటికి వచ్చి శివానీతో గొడవ పెట్టుకునేవాడు. అలా.. ఈ నెల 24న కూడా తన సోదరితో గొడవ పెట్టుకున్నాడు.
డ్రగ్స్ మత్తులో ఉన్న హిమాన్షు.. తన చెల్లి శివానీపై విరుచుకుపడ్డాడు. కర్రతో చితకబాదాడు. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక… కిచెన్ లో గొయ్యి తవ్వాడు. అక్కడే పూడ్చిపెట్టాడు. రెండు రోజుల తర్వాత తన చెల్లెలు కనిపించడం లేదంటూ పక్కింటి వారితో చెప్పాడు. కానీ.. హిమాన్షు ప్రవర్తనపై అనుమానం వచ్చిన పక్కింటివారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హిమాన్షు ఇంటికి వచ్చిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయాన్ని మొత్తం హిమాన్షు చెప్పేశాడు. తన డ్రగ్స్ దారికి అడ్డొస్తుందని ఆ కోపంతోనే తన సోదరిని చంపేశానని. కిచెన్ లో పూడ్చి పెట్టానని చెప్పుకొచ్చాడు హిమాన్షు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిమాన్షును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.