centeral Govt good news for farmers 8000 in accounts
Good News : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసిన తర్వాత…బీజేపీ రైతులకు సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుని పలు పథకాలతో రైతులకు ప్రోత్సాహం కల్పిస్తుంది. దీనిలో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి మొదటి తారీకు పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లాస్ట్ బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రధాని మోడీ
centeral Govt good news for farmers 8000 in accountsపలువురు కేంద్ర మంత్రులతోపాటు చర్చించి సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అందించే మొత్తాన్ని పెంచే యోచనలో కేంద్రం ఉందట. ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి ₹6000 రూపాయలు రైతులకు కేంద్రం అందిస్తూ ఉంది. ఇది మూడు విడతలలో ₹2000 రూపాయలు చొప్పున అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తాన్ని ఈసారి బడ్జెట్ లో ₹8,000కు పెంచే ఆలోచనలో ఉన్నట్లు నాలుగు విడతల్లో ₹2000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో… వేయడానికి కేంద్రం రెడీ అయినట్లు సమాచారం.
centeral Govt good news for farmers 8000 in accounts
ఈ రీతిగా రైతులకు మేలు చేయడానికి మోడీ ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో కేవలం రెండు హెక్టార్ల లోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేశారు. కానీ తర్వాత ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 12 సార్లు రైతుల ఖాతాలో నిధులను జమ చేయడం జరిగింది. అయితే ఈసారి చివరి బడ్జెట్ నేపథ్యంలో రైతులకు ఈ పథకం కింద ఎనిమిది వేల రూపాయలు అందించాలని కేంద్రం డిసైడ్ అయినట్లు సమాచారం.
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
This website uses cookies.