Loksabha Elections 2024 : ఇకపై బ్యాంకు నుండి 50 వేలకు పైగా విత్ డ్రా చేయడం కష్టమే…ఆర్బిఐ కీలక నిర్ణయం..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: April 28, 2024, 1:00 pm

Loksabha Elections 2024 : దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్బిఐ కీలక నిబంధనలను పెట్టింది. భారతదేశంలో ఏప్రిల్ 19 2024 నుండి లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కానుండగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి డేట్ ఖరారు అవడంతో కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను అమలు చేస్తూ వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో డబ్బు లావాదేవీలు జరగటం అనేది సర్వసాధారణం. ఇక ఈ సమయంలో అధిక మొత్తంలో డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. దీంతో ఈ విషయంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఆర్థిక లావాదేవిలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నగదును తీసుకువెళ్లే వారికి కొత్త నిబంధనాలను అమలులోకి తీసుకువచ్చింది.

Loksabha Elections 2024 : పత్రాలు లేకుండా 50 వేలకు మించితే కష్టమే…

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు 2024 కి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటం వలన ఎవరూ కూడా సరైన పత్రాలు లేకుండా 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడానికి అనుమతి లేదని ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సరైన పత్రాలు లేకుండా డబ్బును రవాణా చేసినట్లయితే వాటిని ఎన్నికల బృందాలు జప్త్ చేసి కమిటీకి సమర్పించి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జిల్లా కుందూ లోటు కమిటీ చైర్మన్ జిల్లా పంచాయతీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి రాహుల్ శరణప్ప సంకనూరు మాట్లాడుతూ అధికారులు సరైన పత్రాలు లేకుండా స్వాధీనం చేసుకున్నటువంటి నగదును విడుదల చేయాలంటే తగిన పాత్రలతో జిల్లా కుందూ లోటు కమిటీకి వినతి పత్రం అందజేయాల్సిందిగా తెలియజేశారు.

Loksabha Elections 2024 : ఇకపై బ్యాంకు నుండి 50 వేలకు పైగా విత్ డ్రా చేయడం కష్టమే...ఆర్బిఐ కీలక నిర్ణయం..!

Loksabha Elections 2024 : ఇకపై బ్యాంకు నుండి 50 వేలకు పైగా విత్ డ్రా చేయడం కష్టమే…ఆర్బిఐ కీలక నిర్ణయం..!

Loksabha Elections 2024 : బ్యాంకు నుండి ఇంతకంటే ఎక్కువ విత్ డ్రా చేయలేరు..

అలాగే ఎన్నికల సమయంలో RTGS/NEFT ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ముందస్తు నోటీస్ లేకుండా వ్యక్తులు ఖాతాలకు బదిలీ చేసిన అనుమానాస్పద నగదు డిపాజిట్ లక్ష కంటే ఎక్కువ చేసిన తగిన చర్యలు తీసుకోబడతాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల సమయంలో ఖాతాదారులు వారి యొక్క బ్యాంక్ ఖాతా నుండి లక్ష రూపాయలకు మించి విత్ డ్రా చేయరాదనే నిబంధనను ఇటీవల ఎన్నికల సంఘం రూపొందించింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp