
Modi : జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ.. ఎందుకీ మార్పు..?
Modi : ప్రధాని నరేంద్ర మోడీకి, జగన్ కు ఇప్పటి వరకు పెద్దగా పొరపొచ్చాలు లేవు. ఇప్పటి వరకు జగన్ మోడీని ఏమీ అనలేదు. అటు మోడీ కూడా ఎన్నడూ వైసీపీ ప్రభుత్వాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు టీడీపీతో ఏపీలోకూటమిగా ఏర్పడ్డ బీజేపీ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఇక మోడీ అయితే స్వయంగా జగన్ మీద ఫైర్ అవుతున్నారు. జూన్ 4వ తేదీ జగన్ ప్రభుత్వానికి ఆఖరు రోజు అని తేల్చేస్తున్నారు. జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. వారు మార్పు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. దాంతో ఇప్పుడు అందరి దృష్టి మోడీపై పడింది.
మోడీ ఇంతకు ముందు కూడా ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. కానీ ఇంతలా ఒక ప్రభుత్వానికి డెడ్ లైన్ అయితే అస్సలు పెట్టలేదు. మొన్న చిలకలూరిపేటకు వచ్చినప్పుడు కూడా జగన్ పేరెత్తలేదు. కానీ 6, 7వ తేదీన మాత్రం ఏపీలో జగన్ మీద విమర్శలు గుప్పించారు. వైసీపీకి కాంగ్రెస్ లక్షణాలు ఉన్నాయన్నారు. అందుకే వారు ఏపీలో కుటిలత్వాన్ని, నిరంకుశత్వాన్ని, అవినీతిని పెంచి పోషిస్తున్నారంటూ విమర్శించారు మోడీ. అయితే జగన్ మీద ఇంతగా కామెంట్లు చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.ఆమె నిత్యం మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఆమె విభజన హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అంతే కాకుండా స్టీల్ ప్లాంట్ గురించి, ప్రత్యేక హోదా గురించి నిత్యం నిలదీస్తున్నారు.
Modi : జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ.. ఎందుకీ మార్పు..?
దాంతో షర్మిల విమర్శలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. అందుకే మోడీ వచ్చి షర్మిల, జగన్ ఒక్కటే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో పాటు జగన్ విశ్వసనీయతపై కూడా మోడీకి అనుమానం ఉంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే జగన్ ఇండియా కూటమికి మద్దతిస్తాడేమో అని మోడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.మోడీ తనకు అనుకూలంగా లేకపోతే ఎవరినైనా టార్గెట్ చేస్తుంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు జగన్ ను ఇంతగా టార్గెట్ చేయడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు మోడీకి, జగన్ కు గ్యాప్ వచ్చేసింది.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
This website uses cookies.