Vijay Mallya : ఇండియా కి తిరిగి వస్తారా అని అడిగితే ఏమన్నాడో చూడండి..? విజయ్ మాల్యా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijay Mallya : ఇండియా కి తిరిగి వస్తారా అని అడిగితే ఏమన్నాడో చూడండి..? విజయ్ మాల్యా

 Authored By siddhu | The Telugu News | Updated on :19 February 2026,10:00 am

ప్రధానాంశాలు:

  •  Vijay Mallya : ఇండియా కి తిరిగి వస్తారా అని అడిగితే ఏమన్నాడో చూడండి..? విజయ్ మాల్యా

Vijay Mallya : వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్ కు తిరిగి రావడంపై తాజాగా బాంబే హైకోర్టుకు వింత సమాధానం ఇచ్చారు. తాను ప్రస్తుతానికి ఇండియాకు రాలేనని దానికి కారణం తన వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే బ్రిటన్ కోర్టులు తనను దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించాయని అందుకే ప్రయాణం చేయడం సాధ్యం కాదని కోర్టుకు వెల్లడించారు. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. తన పిటిషన్లను విచారించాలని ఆయన కోరుతుండగా మీరు దేశంలో లేనప్పుడు విచారణ ఎలా సాధ్యమని హైకోర్టు నిలదీసింది.

Vijay Mallya ఇండియా కి తిరిగి వస్తారా అని అడిగితే ఏమన్నాడో చూడండి విజయ్ మాల్యా

Vijay Mallya : ఇండియా కి తిరిగి వస్తారా అని అడిగితే ఏమన్నాడో చూడండి..? విజయ్ మాల్యా

Vijay Mallya న్యాయం ముందు నిలబడాల్సిందే

విజయ్ మాల్యా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భారత ప్రభుత్వం 2016లోనే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిందని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇంగ్లాండ్ మరియు వేల్స్ కోర్టుల ఆదేశాల ప్రకారం ఆయన ఆ దేశాల సరిహద్దులు దాటడానికి వీల్లేదని కనీసం ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే హక్కు కూడా లేదని వివరించారు. అయితే చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ మరియు జస్టిస్ గౌతమ్ అంఖాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం విదేశీ కోర్టుల ఉత్తర్వులను సాకుగా చూపిస్తూ తప్పించుకోవడం కుదరదని ఒకవేళ విచారణ జరగాలని అనుకుంటే మాల్యా ముందుగా భారత గడ్డపై అడుగు పెట్టాలని కోర్టు నిక్కచ్చిగా చెప్పేసింది. దేశం విడిచి పారిపోయిన వారు విదేశాల్లో ఉండి ఇక్కడి న్యాయ వ్యవస్థను శాసించలేరని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ మాల్యా భారత్‌కు రాకుండా కేవలం కాలయాపన చేసేందుకే ఇలాంటి కారణాలను వెతుకుతున్నారని పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఉంటూ సాంకేతిక సమస్యలను సాకుగా చూపిస్తున్నారని ఆయనకు నిజంగా భారత న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే ఇక్కడికి వచ్చి విచారణ ఎదుర్కోవాలని సవాలు విసిరారు. చట్టం ముందు అందరూ సమానమేనని పరారీలో ఉన్న నేరస్థులకు ఎటువంటి మినహాయింపులు ఉండవని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ బాంబే హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మొత్తానికి మాల్యా సమాధానం కోర్టును సంతృప్తి పరచకపోగా ఆయనను వెనక్కి రప్పించే దిశగా ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సాకులు చెబుతూ ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మాల్యా ప్రయాణం పై బ్రిటన్ ఆంక్షలు ఉన్నాయనేది కేవలం ఒక వంక మాత్రమేనని అర్థమవుతోంది.

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది