
BJP : ఢిల్లీ వెళ్ళిన పురందేశ్వరి.. పొత్తుపై బీజేపీ నిర్ణయం ఏంటి..?
BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లకు టెన్షన్ మొదలైంది. అయితే పురందేశ్వరి తో పాటు బీజేపీలోని అగ్ర నాయకులు ఢిల్లీకి వెళ్లారు. అయితే బీజేపీ హై కమాండ్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి అధ్యక్షులను పార్టీ క్యాడర్ ను ఢిల్లీకి పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కోరోజు మీటింగ్ జరగగా తాజాగా బుధవారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ నాయకులతో మీటింగ్ జరిపింది హై కమాండ్. ఈ మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు తలరాతలు మారనున్నాయని అంటున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తలరాతలు ఢిల్లీలో డిసైడ్ అవుతుందని అంటున్నారు.
ఏపీకి సంబంధించిన కొన్ని రిపోర్టులను బీజేపీ లీడర్స్ ఢిల్లీకి తీసుకువెళ్లారు. వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది అని, పొత్తు పెట్టుకోకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి అని ఒక రిపోర్ట్ ను బీజేపీ లీడర్లు బీజేపీ హై కమాండ్ కి తెలియజేశారని అంటున్నారు. మీటింగ్లో లోకల్ క్యాడర్ చెప్పే మాటలను హైకమాండ్ వినిపించుకుంటుంది. ఇక చంద్రబాబు నాయుడు దగ్గరి బంధువు పురందేశ్వరి కాబట్టి ఆమె మాటలను బీజేపీ హై కమాండ్ కచ్చితంగా వింటుంది. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ గా నిలిచారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎన్నికల గెలిచిన తర్వాత బీజేపీని పక్కన పెట్టారు. దీంతో కేంద్రం వీటన్నింటిని చెక్ చేసుకుంటుంది. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంతో ఆ ముగ్గురు తలరాతలు మారబోతున్నాయని అంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ హై కమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఏపీలో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను ప్రకటించిన కేంద్రం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎంపీ సీట్లు ఖరారు చేయలేదు. ఈ క్రమంలోనే పొత్తు ఉందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ బీజేపీ జనసేన తో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఈ పొత్తు కొనసాగుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. అయితే పొత్తు కచ్చితంగా ఉంటుందని కొందరు అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు ఉంటే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు అని అంటున్నారు. మరి పొత్తుపై బీజేపీ హై కమాండ్ నరేంద్ర మోడీ, జేడీ నడ్డా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరికొన్ని గంటలో తెలియనుంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ లీడర్లు అక్కడ మీటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో నిర్ణయం ఏంటనేది బీజేపీ హై కమాండ్ తెలియజేయునది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.