YS Jagan : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ YS Jaganవచ్చే సార్వత్రిక ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే. ఎట్టి పరిస్థితులలో జరగబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా 175 కి 175 స్థానాలు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు సమన్వయకర్తలు, ఇన్చార్జులు నిరంతరం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రతి ఎమ్మెల్యే స్థానిక నియోజకవర్గంలో పర్యటించేలా టాస్క్ పెట్టడం జరిగింది. ఇదే సమయంలో మరొక రాష్ట్రవ్యాప్తంగా జగన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేయించుకుంటూ ఉన్నారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13వ తారీకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో నేతలతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్లు అసలు ఇల్లు గడప దాటి ప్రజలలోకి వెళ్ళటం లేదని.. సీఎం జగన్ మండిపడటం జరిగిందంట. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళకుండా వ్యవహరించిన ఎమ్మెల్యే లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇలానే వ్యవహరిస్తే టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని.. ప్రజలలో మీపై అసంతృప్తి ఉందని డేంజర్ జోన్ లో ఉన్నట్లు సదరు నేతలకు జగన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంట. ఈ క్రమంలో పార్టీ నేతలతో జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతేకాదు మార్చి 18 నుండి మా భవిష్యత్తు నీవే జగన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నేతలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గృహ సారథులు కీలకమని స్పష్టం చేశారు. వాళ్లు ప్రతి ఇంటితో టచ్ లో ఉండాలని పేర్కొన్నారు. ఇంకా ఆదేశించిన కార్యక్రమాలలో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహరిస్తే టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని.. అధినేత నేతలకు చురకలాంటించడం జరిగింది.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.