Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :27 September 2025,9:00 am

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు  7 మిలియన్ల మంది వాయు కాలుష్యం బారిన పడి మృతి చెందుతున్నారు. నిపుణుల ప్రకారం, ప్రజలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు శరీరం కొన్ని ముఖ్య సంకేతాల ద్వారా ముందే హెచ్చరిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

#image_title

ఊపిరితిత్తుల నష్టానికి సంకేతాలు:

నిరంతర దగ్గు : మూడు వారాలకుపైగా దగ్గు తగ్గకపోవడం, శ్లేష్మం లేదా రక్తం కలిసిన దగ్గు రావడం ప్రమాద సూచిక.
శ్వాస ఇబ్బంది : నడక, మెట్లు ఎక్కడం వంటి సాధారణ కార్యకలాపాల్లోనూ ఊపిరి ఆడకపోవడం.
ఛాతీ నొప్పి లేదా బిగుతు : దగ్గు, నవ్వు లేదా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీలో మంట, నొప్పి.
శ్వాసలో గురక : వీజింగ్ శబ్దం రావడం వాయుమార్గాల ఇరుకుదనానికి సంకేతం.
అలసట, బరువు తగ్గడం : తగినంత ఆక్సిజన్ అందకపోవడం వలన శక్తి తగ్గిపోవడం, ఆకస్మికంగా బరువు తగ్గడం.

నిపుణుల సూచనలు:

* వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ ధరించడం.
* ధూమపానం పూర్తిగా మానుకోవడం.
* శ్వాసలో ఏవైనా అసాధారణ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించడం.
* ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, శ్వాసాభ్యాసాలు చేయడం.

నిపుణులు చెబుతున్నట్టుగా, ఊపిరితిత్తుల సమస్యలను మొదటి దశలోనే గుర్తిస్తే సమయానికి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే అది ప్రాణాంతక స్థాయికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి