
nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : గత కొద్ది రోజులుగా డీఏకి సంబంధించి అనేక ప్రచారాలు, వార్తలు హల్చల్ చేస్తుండగా, ఎట్టకేలకు త్రిపుర ప్రభుత్వం ఉద్యోగులకి 5 శాతం డీఏను పెంచనుంది. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా డియర్నెస్ అలవెన్స్ను 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు ఉంటుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం లేదా 4 శాతం డియర్నెస్ అలవెన్స్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి కలిపి ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది. ఈసారి ఉద్యోగులకు, పెన్షనర్లకు 5 శాతం డీఏ, డీఆర్ పెరగనుందన్న వార్తలు వస్తున్నాయి.
అయితే త్రిపురలో డీఏ పెరగడం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 1,04,683 మంది ఉద్యోగులు.. 80,855 మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. మొత్తంగా 1,88,494 మంది లబ్ధి పొందనున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. దాంతో 7.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగింది. మోదీ ప్రభుత్వం కూడా త్వరలో డీఏపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
7th Pay Commission on Tripura government hikes 5 percent da
ఇది ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రిపుర ప్రభుత్వం నిర్ణయం జూలై 1 2022 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి సుశాంత చౌదరి తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకునేందుకు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా 5 శాతం డీఏ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 5 శాతం డీఏ పెంచితే ఉద్యోగులకు అది శుభవార్తే. ఉద్యోగులకు 39 శాతం డీఏ లభించనుంది. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డీఆర్ కూడా పెరుగుతుంది.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.