ప్రియుడితో కలిసి భర్తను పక్కా ప్లాన్ తో చంపేసిన భార్య .. ఆఖరికి ఏమీ తెలియని నంగనాచిలా ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ప్రియుడితో కలిసి భర్తను పక్కా ప్లాన్ తో చంపేసిన భార్య .. ఆఖరికి ఏమీ తెలియని నంగనాచిలా ..??

బహుశా పోయేకాలం అంటే ఇదేనేమో. రోజు రోజుకి పాపాలు పెరుగుతున్నాయి. మనిషిలో మానవత్వం అనేది లేకుండా పోతుంది. శారీరక, ఆర్థిక సంబంధాలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నాయో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా విశాఖపట్నంలో జరిగిన కానిస్టేబుల్ రమేష్ హత్య ఉదంతం తెలియజేస్తుంది. బర్రి రమేష్ వైజాగ్ వన్ టౌన్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడికి శివానితో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే శివానికి టాక్సీ డ్రైవర్ రామారావు […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 August 2023,4:00 pm

బహుశా పోయేకాలం అంటే ఇదేనేమో. రోజు రోజుకి పాపాలు పెరుగుతున్నాయి. మనిషిలో మానవత్వం అనేది లేకుండా పోతుంది. శారీరక, ఆర్థిక సంబంధాలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నాయో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా విశాఖపట్నంలో జరిగిన కానిస్టేబుల్ రమేష్ హత్య ఉదంతం తెలియజేస్తుంది. బర్రి రమేష్ వైజాగ్ వన్ టౌన్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడికి శివానితో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే శివానికి టాక్సీ డ్రైవర్ రామారావు పరిచయం ఏర్పడింది. అది కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి భర్త ఆమెను మందలించాడు. చాలాసార్లు అతనితో దొరికిపోవడంతో భర్త అతనితో వెళ్లిపొమ్మని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పెళ్లికి కట్నం కింద ఇచ్చిన అరెకరం పొలంతో పాటు అతడి అడ్డు తొలగించుకుంటే తనని ఎవరు ప్రశ్నించరని ప్రియుడుతో కలిసి పెద్ద ప్లాన్ వేసింది. భర్తను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చింది. అలాగే బంగారం తాకట్టు పెట్టి ప్రియుడికి లక్షన్నర ఇచ్చింది. ఈనెల 1 ప్రియుడిని ఇంటికి పిలిచి ప్లాన్ అమలు చేశారు.

A wife her husband crime news

A wife her husband crime news

రమేష్ కి మద్యం తాగించి వీడియోలు తీసింది. రమేష్ పడుకునేంతసేపు ప్రియుడిని ఇంటి కింద ఉంచింది. అతడు పడుకున్నాక రామారావు, నీలాలను పిలిచింది. ఆ తర్వాత రమేష్ మొహంపై దిండు పెట్టి బలంగా నొక్కారు. ఈ ఘటన మొత్తాన్ని భార్య వీడియో తీసి తెల్లారేసరికి పడి ఉన్నాడని గుండెపోటుతో మరణించాడని బంధువులకు తెలిపింది. అంత్యక్రియలు చేయడానికి హడావిడి చేయడంతో రమేష్ అన్నయ్యకు డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రమేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. అందులో రమేష్ ఊపిరాడక చనిపోయాడని తేలింది. దీంతో ఆమె వ్యవహారం అంతా బయటపడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది