
Andhra Pradesh cm ys jagan popularity increased
YS Jagan : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అందుకే రాజకీయ నాయకులు కూడా ప్రతినిత్యం తమను తాము మార్చుకుంటూ ప్రజల నాడిని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటారు. మరోవైపు రాజకీయ నాయకుల, పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతోందో చెప్పేందుకు చాలా సర్వేలను నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా జాతీయ మీడియా సంస్థలు కొన్ని ఏపీలో నిర్వహించిన సర్వేలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఓవైపు ఏపీలో పచ్చ మీడియా ఏపీ సీఎం జగన్ పై లేనిపోనివి రాస్తూ, ప్రాంతీయంగా సీఎం జగన్ ను బ్యాడ్ చేసేందుకు అవి చేయని ప్రయత్నాలు ఉండవు. కానీ.. నేషనల్ మీడియాలో ఎంతో పేరున్న ఇండియా టుడే, ఇండియా టీవీలు నిర్వహించిన సర్వేల ఫలితాలు చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.
ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వే ప్రకారం, ఏపీ సీఎంగా జగన్ ను 57 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారట. 2019 లో 50 శాతం మంది ప్రజలు మాత్రమే జగన్ ను సీఎంగా కావాలనుకున్నారు. కానీ.. కేవలం మూడేళ్లలోనే జగన్ కు ప్రజాదరణ పెరిగింది కానీ తగ్గలేదు. ఏపీలో ఇప్పటి వరకు ఏ సీఎం ప్రవేశపెట్టని పథకాలను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల చాలామంది లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆ పథకాలే సీఎం జగన్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. ఏపీలోని సంక్షేమాభివృద్ధి పథకాలు, సామాజిక న్యాయాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని సర్వేలోనూ ప్రస్తావించింది ఇండియా టుడే.
Andhra Pradesh cm ys jagan popularity increased
ఈ సర్వేలో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పిన ఇండియా టుడే.. రెండో స్థానంలో టీడీపీ నిలుస్తుందని తెలిపింది. బీజేపీ హవా ఏపీలో అంతగా లేదని తెలిపింది. జనసేన గురించి అయితే సర్వేలో ప్రస్తావనే లేదు. వైసీపీ 18 ఎంపీ స్థానాల్లో గెలవనుందట. టీడీపీ మాత్రం కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందట. అంతే కాదు.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్ ఐదో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ నిలవగా.. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నాలుగో స్థానంలో నిలవగా.. ఐదో స్థానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలిచారు.
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
This website uses cookies.