తిరుపతి ఉపఎన్నిక ముందు సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్?

ప్రస్తుతం ఏపీలో ఒకటే హాట్ టాపిక్. అదే తిరుపతి ఉపఎన్నిక. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఏపీలో ఏ ఎన్నికలు జరగలేదు. ఇటీవల తిరుపతి ఎంపీ అకాల మృతి చెందడంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ తిరుపతి ఉపఎన్నిక కోసం సమాయత్తమవుతున్నాయి.

ap cm ys jagan shocking decision on ap high court

తిరుపతిలో 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాద్ గెలిచారు. మళ్లీ అధికార పార్టీనే తిరుపతి సీటును దక్కించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి ఉపఎన్నికలో గెలిచి ఏపీ ప్రజలంతా ఇంకా వైసీపీ వైపే ఉన్నారని చాటిచెప్పాలని ప్రయత్నిస్తోంది.

అందుకే.. ఈ ఉపఎన్నికకు ముందు రాయలసీమకు ఏదో ఒక బంపర్ హామీ ఇవ్వాలని తెగ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే.. సీఎం జగన్.. మూడు రాజధానులను ప్రకటించారు. రాయలసీమలో ఒక రాజధాని అని కూడా ముందే ప్రకటించడంతో.. ప్రస్తుతం రాయలసీమ వాసులు జగన్ కు ఫేవర్ గానే ఉన్నారు.

హైకోర్టును కర్నూలుకు తరలించి.. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని ముందే సీఎం జగన్ నిర్ణయించారు. అదేదో తిరుపతి ఉపఎన్నికకు ముందే చేస్తే బెటర్ కదా.. అటు ఉపఎన్నికలో ప్రజలు కూడా వైసీపీ ఓట్లేసే అవకాశం ఉందని.. తిరుపతి ఓటర్లను తమవైపునకు తిప్పుకోవాలంటే.. ఎన్నికకు ముందు కర్నూలుకు హైకోర్టును తరలించాలని ఏపీ సీఎం భావిస్తున్నారట.

ap cm ys jagan shocking decision on ap high court

దాని కోసం చేయాల్సిన పనులను కూడా ఇప్పటికే ప్రారంభించారట. రాష్ట్రపతి నుంచి హైకోర్టు తరలింపునకు పర్మిషన్ వస్తే.. వెంటనే కర్నూలుకు హైకోర్టును తరలించేస్తారు. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు హైకోర్టు మార్పు విషయం గురించి కూడా చర్చకు వచ్చిందట. కేంద్రం కూడా ఈ విషయంపై పెద్దగా అభ్యంతరాలేమీ చెప్పలేదట. కేంద్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే.. ఇక హైకోర్టు మార్పు తథ్యం అన్నమాట. అందుకే.. అదేదో తిరుపతి ఉపఎన్నిక ముందే కానిచ్చేస్తే… తిరుపతి ఉపఎన్నికలో మరోసారి తిరుగులేని గెలుపును ఖాయం చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ ప్లాన్ వేరే?

అయితే.. సీఎం జగన్ వైసీపీ గెలుపు కోసం హైకోర్టును మారుస్తుంటే.. బీజేపీ కూడా తమ పార్టీ గెలుపు కోసం.. హైకోర్టు తరలింపునకు పర్మిషన్ ఇస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. తిరుపతిలో గెలుపు వైసీపీకి ఎంత ముఖ్యమో.. బీజేపీకి కూడా అంతే ముఖ్యం. అందుకే.. కేంద్రం నుంచి హైకోర్టు తరలింపు పర్మిషన్ ఇస్తే.. రాయలసీమ వాసుల్లో బీజేపీపై గౌరవం పెరుగుతుందని.. అది ఓట్ల రూపంలో వస్తుందని బీజేపీ ఆశిస్తోంది. చూద్దాం మరి.. అసలు ఏం జరగుతుందో హైకోర్టు విషయంలో?

Recent Posts

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

14 minutes ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

2 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

4 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

6 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

8 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

9 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

10 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

11 hours ago