AP Dwacra | ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్‌.. డ్వాక్రా రుణాలపై వడ్డీ తగ్గింపు, పెద్ద ఊరట!

Authored By Sam C | The Telugu News | Updated on : 14 September 2025, 6:00 pm

AP Dwacra |  ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, మహిళల సాధికారతను ప్రాధాన్యంగా తీసుకుంటూ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో వడ్డీ భారం తగ్గిస్తూ, గమనించదగ్గ నిర్ణయం తీసుకుంది.

#image_title

వడ్డీ రేట్లపై రెండు శాతం తగ్గింపు

ఇప్పటి వరకూ డ్వాక్రా సంఘాల మహిళలకు ఇవ్వబడే స్త్రీ నిధి రుణాలపై 12% వడ్డీ, బ్యాంక్ లింకేజీ రుణాలపై 13% వడ్డీ అమలులో ఉంది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఈ వడ్డీ రేట్లు రెండు శాతం తగ్గించి వరుసగా 10% మరియు 11% కి పరిమితం చేశారు.

గతంలో పావలా వడ్డీ పథకం కింద రూ.3 లక్షల లోపు రుణాలకు మాత్రమే తక్కువ వడ్డీ వర్తించేది. కానీ తాజా నిర్ణయంతో, ఎంత మొత్తం రుణం తీసుకున్నా రెండు శాతం రాయితీ వర్తించనుంది. దీనివల్ల వేలాది మహిళలకు భారీ ఊరట లభించనుంది. మొత్తంగా చూస్తే, వడ్డీ తగ్గింపుతో పాటు డిజిటల్ టూల్స్ ఉపయోగించి డ్వాక్రా కార్యకలాపాల్లో పారదర్శకత తీసుకురావాలనే ప్రభుత్వం తలపెట్టిన ఈ వ్యూహం, మహిళల సాధికారతలో మరో ముందడుగు అని చెప్పవచ్చు.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి