Bandi Sanjay : పార్టీలో చేరిన ఈటలను తట్టుకోవాలంటే.. బండి సంజయ్ ఆమాత్రం కష్టపడక తప్పదు?

Advertisement
Advertisement

Bandi sanjay హైదరాబాద్ : తెలంగాణ Telangana బీజేపీ BJP అధ్యక్షుడు బండి సంజయ్ Bandi sanjay పాదయాత్రకు రెడీ అవుతున్నారు. భారీ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరు నిర్ణయించారు. ఈ మేరకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో శుక్రవారం నాడు ఎమ్మెల్యే రాజా సింగ్, BJP నేతలు బాబు మోహన్, డాక్టర్ చంద్రశేఖర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్ర పేరును ప్రకటించారు.

Advertisement

Bandi sanjay vs etela rajender in BJP

ఆగస్టు 24న భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ఆరంభం కానుందని MLA రాజా సింగ్ వెల్లడించారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అయితే.. ఆగస్టు 9నే పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా వాయిదా పడింది. అయితే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేపథ్యంలో తన ఎంపీలకు BJP విప్ జారీచేయడంతో MP బండి సంజయ్ తప్పనిసరిగా ఢిల్లీలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను ఆగస్టు 24 నుంచి చేపట్టాలని నిర్ణయించారు.

Advertisement

బిజీ బిజీగా.. Bandi sanjay

మరోవైపు, కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి G. కిషన్‌రెడ్డి ఈనెల 16 నుంచి రాష్ట్రంలో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలోనూ సంజయ్‌ పాల్గొనాల్సి ఉండటంతో ఆయా కారణాల దృష్ట్యా సంజయ్‌ పాదయాత్ర వాయిదా పడింది. కేంద్రంలో కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈనెల 16న రాష్ట్రానికి వస్తున్న కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద భారీగా కిషన్ రెడ్డికి స్వాగతం పలుకనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాకే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సంజయ్‌ పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

bjp

వారం రోజుల పాటు ఆయన ఆ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా బీజేపీ వర్గాలు ప్లాన్ చేశాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇక బండి సంజయ్ కు ఎదురే లేదనే ప్రచారం సాగింది. దీంతో ఆ పార్టీ నేతలే సంజయ్ కు చెక్ పెట్టాలని భావిస్తూ బండి సంజయ్ తీసుకునే నిర్ణయాలు కార్యరూపం దాల్చకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆ పార్టీ విజయాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైనా నాయకుల మధ్య సఖ్యత పెరిగి పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించి పార్టీ విజయానికి బాధ్యత వహించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

51 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

10 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

11 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

12 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

13 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

14 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

15 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

16 hours ago

This website uses cookies.