Millet tiffin Business Idea get best profit
Covid : కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి ఆపత్కాల సాయం కింద కేంద్రం రూ. 5 వేల నగదు ఇస్తోందట. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తలు మీరూ విన్నారా..! అయితే ఒక్క విషయం తెలుసుకోండి. ఇదంతా వట్టి అసత్య ప్రచారం. అవును సైబర్ నేరగాళ్ల కొత్త పంథా ఇది. సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ తమ వైఖరి మారుస్తూ లక్షలు మాయం చేస్తున్నారు.
కరోనా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బాధితులకు కోవిడ్ ఫండ్స్ నుంచిరూ.5వేలు అందిస్తోందని వైరల్ చేస్తున్నారు. దీనికి ఆ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 15వ తేదీ చివరి గడువు అంటున్నారు. లింక్లను పెడుతూ అందులో బ్యాంకు వివరాలు ఎంటర్ చేయిస్తూ.. అయా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే కోవిడ్ రిలీఫ్ ఫండ్ అనే స్కీమ్ ఏమీ లేదని.. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
central govt gives clarity on covid relief fund fake news
కోవిడ్ ఫండ్ పేరిట వచ్చే మెసేజ్ లింక్లపై క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంకు వివరాలు, వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని, ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఖాళీ చేస్తారని కేంద్రం హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా, తిండిలేక ఎన్నో కష్టాలను పడ్డారు. అదే అదనుగా భావించి కొందరు మోసగాళ్లు జనాలను బురిడి కొట్టిస్తున్నారు.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
This website uses cookies.