
china hackers
china : ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ను కనిపెట్టిన భారతీయ సంస్థలపై చైనా ప్రభుత్వం కన్నేసింది. ఆ దేశం కంటే భారతీయ వ్యాక్సిన్ లకే అధిక ప్రాధాన్యత ఏర్పడిన విషయాన్నీ జీర్ణించుకోలేని చైనా భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కంపెనీలపై హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు తేలింది. ఇరు దేశాల ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశం ఈ రకమైన చర్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది.
చైనా ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. డ్రాగన్ దేశంలో పుట్టిన కరోనా కు టీకా తయారీలో ప్రపంచ దేశాలకు ఆశ జ్యోతిలుగా మారిన భారత్ బయోటెక్ ను సీరం ఇన్స్టిట్యూట్ లను చైనా హ్యాకర్లు లక్ష్యం చేరుకోవటం జరిగింది. సైఫైర్మ అనే సంస్థ నిఘా వర్గాలు ఈ విషయాన్నీ బయటపెట్టాయి. మహమ్మారి కారణంగా ఏడాది పాటు ఇబ్బందులకు గురి అవుతున్న భారత్ సహా అనేక దేశాలకు భారత్ బయోటెక్ ఆపద్బాందువుడి పాత్ర పోషించాయి.
ఇది చైనాకు కంటికింపుగా మారటంతో రెండు సంస్థలపై దొంగదెబ్బ తీసేందుకు ప్లాన్ చేసింది ఆ దేశం. ఆ సంస్థల ఐటీ వ్యవస్థలపై ఏపీటీ 10 అనే బృందం ద్వారా సైబర్ దాడులకు తెగబడింది చైనా. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ సైఫైర్మ వెల్లడించింది. కొద్దీ నెలలుగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో పరిస్థితిలు ఉద్రిక్తలుగా మారాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కరోనా కు విరుగుడుగా వ్యాక్సిన్ ను తయారుచేసి, సాయంగా లేదా డబ్బులకు ఇతర దేశాలకు విక్రహిస్తూ వస్తున్నాయి.
అయితే చైనా తయారు చేస్తున్న కరోనా టీకా లతో పోల్చి చూస్తే భారత్ టీకాలే ప్రపంచ వ్యాప్తంగా అధిక విశ్వాసంతో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి అమ్ముడైన వ్యాక్సిన్ ల్లో భారత్ వ్యాక్సిన్ల శాతం 60. ప్రపంచాన్ని కాపాడటంలో భారతీయ సంస్థలు ముందు ఉండటాన్ని చైనా తట్టుకోలేకపోతుంది. దీనితో తమ అధీనంలో పనిచేసే హ్యాకర్ల బృందంతో భారతీయ సంస్థలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.
ఏపీటీ 10 అనే బృందం ఈ రెండు సంస్థలను టార్గెట్ చేయటంతో కాకుండా వాటి యొక్క సప్లై చైన్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. దీని ద్వారా వ్యాపార పరంగా లాభం పొందాలనేది దాని లక్ష్యమని సైఫైర్మ అధికారి కుమార్ రితేష్ చెప్పాడు. ఈయన గతంలో బ్రిటిష్ విదేశీ నిఘా సంస్థ ఎంఐ-6 లో పనిచేసాడు. ముఖ్యంగా సీరంపై ఏపీటీ 10 గురి ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. దీనిని అడ్డుకునేందుకు భారతీయ సంస్థలు కూడా తీవ్రంగా పనిచేస్తున్నాయని తెలుస్తుంది.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.