china : ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ను కనిపెట్టిన భారతీయ సంస్థలపై చైనా ప్రభుత్వం కన్నేసింది. ఆ దేశం కంటే భారతీయ వ్యాక్సిన్ లకే అధిక ప్రాధాన్యత ఏర్పడిన విషయాన్నీ జీర్ణించుకోలేని చైనా భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కంపెనీలపై హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు తేలింది. ఇరు దేశాల ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశం ఈ రకమైన చర్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది.
చైనా ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. డ్రాగన్ దేశంలో పుట్టిన కరోనా కు టీకా తయారీలో ప్రపంచ దేశాలకు ఆశ జ్యోతిలుగా మారిన భారత్ బయోటెక్ ను సీరం ఇన్స్టిట్యూట్ లను చైనా హ్యాకర్లు లక్ష్యం చేరుకోవటం జరిగింది. సైఫైర్మ అనే సంస్థ నిఘా వర్గాలు ఈ విషయాన్నీ బయటపెట్టాయి. మహమ్మారి కారణంగా ఏడాది పాటు ఇబ్బందులకు గురి అవుతున్న భారత్ సహా అనేక దేశాలకు భారత్ బయోటెక్ ఆపద్బాందువుడి పాత్ర పోషించాయి.
ఇది చైనాకు కంటికింపుగా మారటంతో రెండు సంస్థలపై దొంగదెబ్బ తీసేందుకు ప్లాన్ చేసింది ఆ దేశం. ఆ సంస్థల ఐటీ వ్యవస్థలపై ఏపీటీ 10 అనే బృందం ద్వారా సైబర్ దాడులకు తెగబడింది చైనా. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ సైఫైర్మ వెల్లడించింది. కొద్దీ నెలలుగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో పరిస్థితిలు ఉద్రిక్తలుగా మారాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కరోనా కు విరుగుడుగా వ్యాక్సిన్ ను తయారుచేసి, సాయంగా లేదా డబ్బులకు ఇతర దేశాలకు విక్రహిస్తూ వస్తున్నాయి.
అయితే చైనా తయారు చేస్తున్న కరోనా టీకా లతో పోల్చి చూస్తే భారత్ టీకాలే ప్రపంచ వ్యాప్తంగా అధిక విశ్వాసంతో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి అమ్ముడైన వ్యాక్సిన్ ల్లో భారత్ వ్యాక్సిన్ల శాతం 60. ప్రపంచాన్ని కాపాడటంలో భారతీయ సంస్థలు ముందు ఉండటాన్ని చైనా తట్టుకోలేకపోతుంది. దీనితో తమ అధీనంలో పనిచేసే హ్యాకర్ల బృందంతో భారతీయ సంస్థలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.
ఏపీటీ 10 అనే బృందం ఈ రెండు సంస్థలను టార్గెట్ చేయటంతో కాకుండా వాటి యొక్క సప్లై చైన్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. దీని ద్వారా వ్యాపార పరంగా లాభం పొందాలనేది దాని లక్ష్యమని సైఫైర్మ అధికారి కుమార్ రితేష్ చెప్పాడు. ఈయన గతంలో బ్రిటిష్ విదేశీ నిఘా సంస్థ ఎంఐ-6 లో పనిచేసాడు. ముఖ్యంగా సీరంపై ఏపీటీ 10 గురి ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. దీనిని అడ్డుకునేందుకు భారతీయ సంస్థలు కూడా తీవ్రంగా పనిచేస్తున్నాయని తెలుస్తుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.