
china hackers
china : ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ను కనిపెట్టిన భారతీయ సంస్థలపై చైనా ప్రభుత్వం కన్నేసింది. ఆ దేశం కంటే భారతీయ వ్యాక్సిన్ లకే అధిక ప్రాధాన్యత ఏర్పడిన విషయాన్నీ జీర్ణించుకోలేని చైనా భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కంపెనీలపై హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు తేలింది. ఇరు దేశాల ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశం ఈ రకమైన చర్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది.
చైనా ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. డ్రాగన్ దేశంలో పుట్టిన కరోనా కు టీకా తయారీలో ప్రపంచ దేశాలకు ఆశ జ్యోతిలుగా మారిన భారత్ బయోటెక్ ను సీరం ఇన్స్టిట్యూట్ లను చైనా హ్యాకర్లు లక్ష్యం చేరుకోవటం జరిగింది. సైఫైర్మ అనే సంస్థ నిఘా వర్గాలు ఈ విషయాన్నీ బయటపెట్టాయి. మహమ్మారి కారణంగా ఏడాది పాటు ఇబ్బందులకు గురి అవుతున్న భారత్ సహా అనేక దేశాలకు భారత్ బయోటెక్ ఆపద్బాందువుడి పాత్ర పోషించాయి.
ఇది చైనాకు కంటికింపుగా మారటంతో రెండు సంస్థలపై దొంగదెబ్బ తీసేందుకు ప్లాన్ చేసింది ఆ దేశం. ఆ సంస్థల ఐటీ వ్యవస్థలపై ఏపీటీ 10 అనే బృందం ద్వారా సైబర్ దాడులకు తెగబడింది చైనా. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ సైఫైర్మ వెల్లడించింది. కొద్దీ నెలలుగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో పరిస్థితిలు ఉద్రిక్తలుగా మారాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కరోనా కు విరుగుడుగా వ్యాక్సిన్ ను తయారుచేసి, సాయంగా లేదా డబ్బులకు ఇతర దేశాలకు విక్రహిస్తూ వస్తున్నాయి.
అయితే చైనా తయారు చేస్తున్న కరోనా టీకా లతో పోల్చి చూస్తే భారత్ టీకాలే ప్రపంచ వ్యాప్తంగా అధిక విశ్వాసంతో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి అమ్ముడైన వ్యాక్సిన్ ల్లో భారత్ వ్యాక్సిన్ల శాతం 60. ప్రపంచాన్ని కాపాడటంలో భారతీయ సంస్థలు ముందు ఉండటాన్ని చైనా తట్టుకోలేకపోతుంది. దీనితో తమ అధీనంలో పనిచేసే హ్యాకర్ల బృందంతో భారతీయ సంస్థలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.
ఏపీటీ 10 అనే బృందం ఈ రెండు సంస్థలను టార్గెట్ చేయటంతో కాకుండా వాటి యొక్క సప్లై చైన్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. దీని ద్వారా వ్యాపార పరంగా లాభం పొందాలనేది దాని లక్ష్యమని సైఫైర్మ అధికారి కుమార్ రితేష్ చెప్పాడు. ఈయన గతంలో బ్రిటిష్ విదేశీ నిఘా సంస్థ ఎంఐ-6 లో పనిచేసాడు. ముఖ్యంగా సీరంపై ఏపీటీ 10 గురి ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. దీనిని అడ్డుకునేందుకు భారతీయ సంస్థలు కూడా తీవ్రంగా పనిచేస్తున్నాయని తెలుస్తుంది.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.