why there is no rahul gandhi bharat jodo yatra in gujarat
YS Jagan : నో వే… ఈసారి అన్ని అసెంబ్లీ సీట్లు వైసీపీకి దక్కాల్సిందే.. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలందరికీ సీఎం జగన్ నూరిపోస్తున్న మాట. ఏపీలో హై మార్జిన్ తో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో వైసీపీ పనిచేస్తోంది. అంతే కాదు.. గత ఎన్నికల్లో మిస్ అయిన సీట్లను కూడా ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని వైసీపీ చూస్తోంది. అంటే ఏపీలో ఉన్న 175 సీట్లను గెలుచుకోవాలి అని పావులు కదుపుతోంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత ఇలాగా కుప్పంలో వైసీపీ పాగా వేసింది. ఎలాగైనా ఈసారి చంద్రబాబును కూడా ఓడించి కుప్పంలో వైసీపీ జెండా ఎగురువేయాలని భావిస్తోంది. నిజానికి.. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ వేరే పార్టీ విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే..
ఏపీ సీఎం వైఎస్ జగన్.. కుప్పంను టార్గెట్ చేశారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. కుప్పంలో కూడా త్వరలో పర్యటించనున్నారు. అంతే కాదు.. కుప్పంలో వైసీపీ గెలిచేలా చేయాలని దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్టుగా జగన్.. నేతలకు మాటిచ్చారట. కుప్పంలో వైసీపీ ఇన్ చార్జ్ పొజిషన్ ను ఎమ్మెల్సీ భరత్ కు ఇచ్చారు. ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధిస్తే మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు వెనుకాడనని సీఎం జగన్ మాటిచ్చారట. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదే ఊపుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు వ్యూహాలు రచించాలని కుప్పం వైసీపీ నేతలకు సీఎం జగన్ సూచించారట.
CM Jagan if all happens to 175 guarantee
అంతే కాదు.. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై కూడా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం రూ.66 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అంతే కాదు.. కుప్పంలో త్వరలో సీఎం జగన్ కూడా పర్యటించబోతున్నారు. ఇంకో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అంతే కాదు.. మూడో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని కూడా సీఎం జగన్.. కుప్పంలోనే ప్రారంభించనున్నారు. ఇలా.. కుప్పం మీద సీఎం జగన్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడంతో కుప్పం చంద్రబాబు చేయి నుంచి జారిపోయి వైసీపీ ఖాతాలో పడిపోయే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.