
mamatha uddav takre and others talks with telangana cm kcr
Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాదు లో పర్యటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పర్యటన ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రధాని పర్యటనకు జ్వరం వచ్చిందంటూ కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశం గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయం కేసీఆర్ కి జ్వరం కారణంగా ఆయన పిఎం ఈ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు అంటూ అధికారికంగా ప్రకటించింది. కానీ మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రధాని రాష్ట్రానికి ఏం చేశారని ఆయన వచ్చినప్పుడు స్వాగతాలు పలకాలి అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు దుమారంను రేపుతున్నాయి. ఇప్పటికే బిజెపి నాయకులు ప్రధాని వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.అందుకు గాను సీఎం కేసీఆర్ కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం ఖాయం అంటూ వాళ్ళు హెచ్చరిస్తున్నారు.
ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని యాదాద్రి గుడి ఆరంభానికి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలకు మరియు మీమ్స్ కు తెర తీస్తుంది. ప్రధాని పర్యటనకు వచ్చిన సమయంలో కనిపించకుండా పోయిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని యాదాద్రికి ఆహ్వానిస్తే వస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది. అయినా ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ ఆహ్వానిస్తారు అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమని కేసీఆర్ ఆహ్వానిస్తే యాదాద్రికి మోడీ రావడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం బీజేపీ మరియు టిఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్న ఈ యుద్దం ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
cm kcr going to delhi for invite pm modi to yadadri temple opening
సీఎం కేసీఆర్ కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ భక్తుడు అంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాజకీయ వ్యూహాత్మకం లో భాగంగానే మోడీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నాడని.. అదే వ్యూహంలో భాగంగా బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారని.. ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరేం లేదు అంటూ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు పక్కన పెడితే అసలు కేసీఆర్ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని యాదాద్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారా… ఒకవేళ కేసీఆర్ ఆహ్వానిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి వచ్చే సమాధానం ఏంటి… ప్రధాని నరేంద్రమోడీ యాదాద్రికి వస్తే అప్పుడు జరిగే రాజకీయ పరిణామాలు ఏమిటి…. అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా ఉన్నాయి.
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
This website uses cookies.