strict measures taken in telangana govt in awake of covid third wave
K. Chandrashekar Rao : సొంత భూమిలో ఇల్లు కట్టుకునే వారికి సీఎం కేసీఆర్ శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరికి వారు సొంత భూమిలో ఇల్లు కట్టుకునేందుకుగాను త్వరలో పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 1,000 లేదా 1,500 మందికి ఈ పథకం కింద అవకాశం ఇస్తామని వివరించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇచ్చామని, అయితే, కరోనా మహమ్మారి వల్ల పథకం ప్రారంభించడం ఆలస్యమైందని చెప్పారు.
kcr-telangana-dalit-bandhu
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అవినీతితో పాటు అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఇప్పుడు అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ‘దళిత బంధు’ పథకం ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.