7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ వాళ్లకు పండుగ నెల అని కూడా చెప్పుకోవచ్చు. ఒకే నెలలో కేంద్రం వాళ్లకు మూడు కానుకలు అందించే అవకాశం ఉంది. డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల చెల్లింపు, పీఎఫ్ వడ్డీ ఇలా.. మూడు బెనిఫిట్స్ ఒకే సారి సెప్టెంబర్ నెలలో రానున్నాయి. సెప్టెంబర్ నెలలోనే ఉద్యోగులకు ఈ బెనిఫిట్స్ అందడం వల్ల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతంగా ఉంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్రం.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను పెంచుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మార్చిలోనే కేంద్రం తొలి డీఏను ప్రకటించింది. రెండో డీఏను ఇంకా కేంద్రం ప్రకటించలేదు. ఆగస్టు నెల ముగిసిపోతుండటంతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ డీఏ పెంపు ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) గత జూన్ నెలలో 129.2 పాయింట్లుగా ఉంది. ఏఐసీపీఐ ప్రకారం.. డీఏ 4 శాతం పెంపునకు ఏడో వేతన సంఘం సిఫారసు చేసినట్టు సమాచారం.
7th Pay Commission good news to central government employees on da hike
ప్రస్తుతం ఉన్న 34 శాతానికి మరో 4 శాతం కలిపితే వచ్చే నెలలో 38 శాతం డీఏ పెరగనుంది. అలాగే కరోనా సమయంలో 18 నెలల డీఏ పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. 18 నెలల డీఏ బకాయిలు అంటే మే 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏను కేంద్రం నిలిపివేసింది. వాటి బకాయిలు మొత్తం సెప్టెంబర్ లోనే కేంద్ర ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది.
అలాగే.. పీఎఫ్ పై 2021 – 22 కు వడ్డీ రేటును 8.10 గా నిర్ణయించారు. ఈ వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సెప్టెంబర్ లో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ కానుంది. అంటే ఒకే నెలలో డీఏ పెంపు, డీఏ బకాయిలు, పీఎఫ్ వడ్డీ.. ఇవన్నీ ఉద్యోగుల ఖాతాల్లో పడటంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.