Hayathnagar : ప్రస్తుత రోజుల్లో సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కుటుంబంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు పెళ్లి చేసుకోవాలనుకునే యువకులకు భయం కల్పిస్తున్నాయి. అంత దారుణంగా బరితెగిచ్చేస్తున్నారు ఆడవాళ్లు. ఒక ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు సైతం పడక సుఖం కోసం కట్టుకున్న పెళ్ళాన్ని.. పిల్లలను చంపేసే పరిస్థితి ప్రస్తుత సమాజంలో కనిపిస్తుంది. సరిగ్గా ఇదే తరహా ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. భర్త ఆర్టీసీ డిపోలో కండక్టర్.. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుని.. భర్తను కడ తేర్చింది. పూర్తి విషయంలోకి వెళ్తే హయత్ నగర్ లో శంకర్ గౌడ్,
రజిత ఇద్దరు భార్యాభర్తలు. వీరు తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. శంకర్ కుకట్ పల్లి డిపోలో పనిచేస్తుండగా రజిత హయత్ నగర్ డిపో 1లో పనిచేస్తుంది. అయితే వీరిద్దరి డ్యూటీ సమయాలు వేరువేరు. దీంతో రజిత తాను పనిచేసే డిపోలో రాజ్ కుమార్ అనే కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. శంకర్ గౌడ్ డ్యూటీ వెళ్లగానే రాజ్ కుమార్… రజిత ఇంటిలోకి వచ్చేవాడు. దాదాపు చాలా సమయం రజిత ఇంట్లో గడిపేవాడు. దీంతో చుట్టుపక్కల వారు నానా రకాలుగా మాట్లాడుకోవడంతో విషయం భర్త శంకర్ గౌడ్ చెవికి దాక వెళ్ళింది. ఈ సమయంలో భార్య రజిత ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్త శంకర్ గౌడ్ పై కోపం పెట్టుకొని…!!
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అతని కానిస్టేబుల్ రాజకుమార్ తో కడతేర్చింది. ఓ రోజు అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని శంకర్ గౌడ్ ఇంటికి వస్తున్న సమయంలో రాజకుమార్ మరియు అతని స్నేహితులు అతన్ని దాడి చేశారు. దీంతో మూడు నెలలు పాటు మంచంపై ఉన్న శంకర్ గౌడ్ తర్వాత… గుండెపోటుతో మరణించాడు. అయితే తన భర్త పై దాడికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఎటువంటి విషయం బయటపడలేదు. అయితే భర్తని అడ్డు తొలగించుకున్న రజిత… ప్రియుడు రాజ్ కుమార్ తో విచ్చలవిడిగా
రాసలీలలు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే తన భర్తని ఎలా చంపారో విషయాన్ని తన స్నేహితురాలితో రజిత చెప్పుకుంది. దీంతో విషయం మొత్తం ఆ స్నేహితురాలు శంకర్ గౌడ్ సోదరుడికి చెప్పటంతో అసలు విషయం బయటపడింది. కట్ చేస్తే శంకర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును తిరిగి ఓపెన్ చేసి రాజకుమార్ నీ అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రజితతో అక్రమ సంబంధమే ఈ దాడికి కారణమని జరిగిందంత వివరించాడు. దీంతో పోలీసులు విచారణ స్టార్ట్ చేయడంతో శంకర్ భార్య రజిత పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.