Huzurabad bypoll
Huzurabad bypoll తెలంగాణలో ఉప ఎన్నిక కోసం సిద్ధంగా ఉన్న హుజూరాబాద్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై అందరి దృష్టి నెలకొంది. నిజానికి ఆగస్టులోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నిక నిర్వహణపై ఈ నెల 28న అభిప్రాయాలు సేకరించింది. దీంతో సెప్టెంబర్లో హుజూరాబాద్ నగారా మోగే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికను నిర్వహించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక టీఆర్ఎస్ సైతం సెప్టెంబర్లోనే ఉప ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో ఉంది.
అంతర్గతంగా తమ పార్టీ శ్రేణులను ఈ మేరకు సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు అక్కడ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన తీరుపై ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు హుజూరాబాద్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయనే దానిపై క్షేత్రస్థాయి నుంచి వివిధ వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారని.. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Huzurabad bypoll
ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక సెప్టెంబర్లో జరుగుతుందన్న టీఆర్ఎస్, బీజేపీ ఆలోచన వెనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మార్చి 28న చనిపోయారు. సెప్టెంబర్ 28 నాటికి ఆయన చనిపోయి ఆరు నెలలు పూర్తి కానుంది. నిబంధనల ప్రకారం శాసనసభ్యుడు మరణించినా లేక రాజీనామా చేసినా ఆరు నెలల్లో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణను కేంద్ర ఎన్నిక సంఘం వాయిదా వేస్తూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండటంతో.. కేంద్రం ఉప ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చేమో అనే చర్చ జరుగుతోంది.
TRS
అదే జరిగితే ఏపీలోని బద్వేలు స్థానంతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని తెలంగాణ రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏపీలోని బద్వేలు నియోజకవర్గంతో పాటే తెలంగాణలోని హుజూరాబాద్కు కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ శ్రేణులకు సంకేతాలు కూడా పంపినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చని.. అంతా సిద్ధంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.
మరోవైపు హుజూరాబాద్లో గెలిచి టీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికపై సీరియస్గా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఒక్కరే ప్రచారంలో దూసుకుపోతున్నా.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలోని బీజేపీ నేతలతో పాటు జాతీయ నేతలు కూడా ప్రచారం పర్వంలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్కు ఏ మాత్రం తీసిపోని విధంగా హుజూరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.
inugala peddireddy may be Joine congress
ఈమేరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా హుజూరాబాద్ లోనే ముగించేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తానికి సెప్టెంబర్లో అయినా హుజూరాబాద్ ఉపఎన్నికకు నగారా మోగుతుందా లేక ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం మరికొంత సమయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
This website uses cookies.