Huzurabad bypoll తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ పెంచుతున్న హుజారాబాద్ ఉప ఎన్నిక Huzurabad bypoll కు సర్వం సిద్ధమవుతోంది. ఈటల రాజేందర్ రాజీనామా తరువాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు అధికార టీఆర్ఎస్ ఈటల రాజేందర్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని చూస్తోంది. అటు నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకోవాలని బీజేపీ తరపున ఈటల రాజేందర్ సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా.. కాంగ్రెస్ బోణీ కొట్టేలా చేయాలని ఆరాటపడుతున్నారు. దీంతో మూడు పార్టీలకు ఈ ఎన్నిక డూ ఆర్ డైగానే మారాయి. దీంతో ఈ ఎన్నికపైనే ఫోకస్ చేశాయి.
ముఖ్యంగా అధికార పార్టీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ కొన్ని రోజుల నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. మరోవైపు ఎన్నికకు వెంటనే సిద్ధమవ్వాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ హింటిచ్చినట్టు తెలుస్తోంది. వారం రోజులుగా ముమ్మరంగా సాగుతున్న ఆయా పార్టీల కార్యకలాపాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో దళితబంధు పథకం ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. అయితే వాసాలమర్రి దళితవాడను సీఎం సందర్శించిన నేపథ్యలో దళితబంధు లబ్దిదారుల ఎంపిక, చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించడానికి హుజూరాబాద్ ఉపఎన్నిక Huzurabad bypoll షెడ్యూలు విడుదల సంకేతాలందడమే కారణమనే ప్రచారం సాగుతోంది.
టీఆర్ఎస్లో పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేరికలకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవడం, కౌశిక్రెడ్డిని మూడ్రోజుల క్రితం గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. మంత్రి హరీశ్రావు.. హుజూరాబాద్లో పార్టీ సమన్వయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. మరో మంత్రి గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు హుజూరాబాద్లో మకాం వేశారు. దీనికంతటికీ ఉపఎన్నిక షెడ్యూలుపై సంకేతాలు రావడమే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందని టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
పాదయాత్రలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఆయన కోలుకునేందుకు 15 రోజులు పడుతుందని సన్నిహితులు అంటున్నారు.అయితే, ఈటెల రాజేందర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే, హుజూరాబాద్ వెళ్తారని తెలుస్తోంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకుండానే ఈటల హుటాహుటీన నియోజకవర్గానికి వెళ్లడం వెనుక ఉపఎన్నిక షెడ్యూలు వార్తలే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమై హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చించింది. మూడు ప్రధాన పార్టీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు వారాంతంలోగా వెలువడుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.