
janasena and ysrcp has tough fight in three constituencies
Janasena : 2019 ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో 151 సీట్లను గెలుచుకుంది. టీడీపీ 23 సీట్లలో గెలవగా, జనసేన మాత్రం ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. 151 సీట్లలో గెలిచి వైసీపీ తన సత్తా చాటింది. జనసేన పార్టీకి ఒకే ఒక్ సీటు దక్కడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢీలా పడిపోయారు. పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ ఆ రెండు స్థానాల్లో వైసీపీనే గెలిచింది. అయితే.. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ఒకప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావమే లేదు. కానీ.. ఇప్పుడు అలా కాదు. అందుకే..
ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు.దానికి తగ్గట్టుగానే ఈ రెండు జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించారు. ఈ రెండు జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఎక్కువ. అలాగే క్షత్రియులు కూడా ఎక్కువే. అందుకే.. ఈ రెండు సామాజికవర్గాలను తనవైపునకు తిప్పుకోవడం కోసం పవన్ కళ్యాణ్ పక్కాగా ప్లాన్ వేస్తున్నారు. ఎలాగూ తనకు అభిమాన బలం ఉంది. అందుకే రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవచ్చని పవన్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం నరసాపురంలో జనసేన బలంగానే ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ నరసాపురంలో పోటీ చేస్తారా? లేక వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తారా?
janasena and ysrcp has tough fight in three constituencies
లేదంటే పొత్తులో భాగంగా మిత్రపక్షానికి టికెట్ కేటాయిస్తారా? అనేది తెలియదు. అలాగే రాజోలు నియోజకవర్గం కూడా జనసేనకు అనుకూలంగానే ఉంది. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వైసీపీ వైపు తిరిగినా జనసేన, వైసీపీ మధ్యే పోరు నడుస్తోంది. భీమవరం, రాజోలు, నరసాపురం ఈ మూడు నియోజకవర్గాలు జనసేనకు బలంగా మారాయి. అలాగే ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేనకు వైసీపీతోనే పోటీ. అందుకే.. ఈ మూడు నియోజకవర్గాల్లో తమ సత్తా చాటడంతో పాటు మిగితా నియోజకవర్గాల్లోనూ పాగా వేయడానికి పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. చూద్దాం మరి.. 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందో.
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
This website uses cookies.