KCR heavy rain damage newly built yadadri temple
KCR : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికలో కేసీఆర్ మార్క్ సోషల్ ఇంజినీరింగ్ స్పష్టంగా కనబడుతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి ఊహాలకు అందని విధంగా కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారని అంటున్నారు.మంగళవారం టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు వెంనటే నామినేషన్స్ దాఖలు చేశారు. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం గమనార్హం.
టీఆర్ఎస్పై రెడ్డి సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరుగుతున్నదని రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో మూడు స్థానాలకు రెడ్డిలను ఎంపిక చేసి ఆ సామాజిక వర్గ మద్దతును కేసీఆర్ కూడగట్టే ప్రయత్నం చేసినట్లు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్సీ కోటాలో నామినేట్ అయిన అభ్యర్థుల్లో మాజీ ఐఏఎస్ ఉన్నాడు.
సిద్దిపేట కలెక్టర్గా సేవలందించిన పి.వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొద్ది క్షణాల్లోనే ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. మొత్తంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. మిగిలిన ముగ్గురిలో బండ ప్రకాష్ ముదిరాజ్.. కాగా, కడియం శ్రీహరి..ఎస్సీ, తక్కళ్లపల్లి రవీందర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.
kcr reddy community given priority for mlc
టీఆర్ఎస్కు ఉన్నటువంటి 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలంలో వీరు ఆరుగురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వరంగల్కు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్ రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా మూడేళ్ల టైం ఉంది. అయినప్పటికీ ఆయన్ను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేస్తున్నారు. త్వరలో ఆయన్ను కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్రెడ్డి, కడియం శ్రీహరిలు వరుసగా రెండో సారి శాసన మండలికి ఎన్నికవుతున్నారు.
హుజురాబాద్కు చెందిన పాడి కౌశిక్రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు కేసీఆర్. కానీ, ఆ నామినేషన్ను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పక్కన పెట్టేశారు. దాంతో పాడి కౌశిక్రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.