Anandayya Ayurveda Medicine : కృష్ణపట్నం ఆనందయ్య గురించి ప్రస్తుతం దేశమంతా మారుమోగిపోతోంది. ఆయన కనిపెట్టిన కరోనా మందుకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఆ మందు కోసం వేల మంది క్యూలు కట్టారు. కరోనా వచ్చి చావు బతుకుల మధ్య ఉన్నవాళ్లు కూడా ఆ మందును వాడి కరోనాను జయించారు. ఇక.. ఆక్సిజన్ తక్కువగా ఉన్నవాళ్లు అయితే.. ఆనందయ్య కంటి మందును వేసుకున్న 5 నిమిషాల్లో లేచి కూర్చున్నారు. వాళ్ల ఆక్సిజన్ లేవల్స్ అమాంతం పెరిగాయి. ఇదంతా కలలా ఉన్నా.. పచ్చి నిజం. కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుకు ఉన్న పవర్ అటువంటిది. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనాను ఆయుర్వేదంతో తరిమికొట్టొచ్చని ఆనందయ్య నిరూపించి చూపించారు.
అయితే.. ఆ మందుపై ఇప్పటికే ఆయుష్ శాఖ పరిశోధనలు జరిపింది. కాకపోతే అది నాటు మందు అని.. అని ఆయుర్వేద మందుగా గుర్తించలేమని.. కానీ అందులో వాడే పదార్థాలన్నీ వనమూలికలు, మూలికా దినుసులు కావడంతో వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి.. ఆ మందును తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది ప్రజలకే వదిలేస్తున్నాం.. అని ఆయుష్ కమిటీ తేల్చి చెప్పింది. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి కరోనా మందు పంపిణీని నిలిపివేసింది. ఢిల్లీకి ఆ మందును టెస్ట్ కోసం పంపించింది. అప్పటి వరకు కరోనా మందు పంపిణీని చేయవద్దని ఆనందయ్యను ప్రభుత్వం కోరింది. దీంతో ప్రస్తుతం ఆ మందును ఎలా తయారు చేయాలా? అని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. సామాజిక మాధ్యమాల్లో కరోనా మందు తయారు చేసే విధానం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది.
ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందును తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల కోసం ఎక్కడో తిరగాల్సిన పనిలేదు. దాని కోసం ఏదైనా ఆయుర్వద షాపునకు వెళ్లినా చాలు. కొన్ని వనమూలికలు అడవిలో దొరుకుతాయి. ఈ ఔషధాన్ని ఆయుష్ డిపార్ట్ మెంట్ వాళ్లు కూడా తయారు చేస్తున్నారు. దాని కోసం వాడిన వనమూలికలు, మూలికా దినుసులు ఇవే.
తెల్ల జిల్లేడు పూలు – 200 గ్రాములు
మారేడు ఇగురు – 200 గ్రాములు
నేరేడు ఇగురు – 200 గ్రాములు
వేప ఇగురు – 200 గ్రాములు
డావరడంగి ఆకులు – 200 గ్రాములు
నల్ల జీలకర్ర – 30 గ్రాములు
పట్టా దాల్చిన చెక్క – 30 గ్రాములు
పసుపు – 30 గ్రాములు
తోక మిరియాలు – 30 గ్రాములు
పచ్చ కర్పూరం – 30 గ్రాములు
ఫిరంగి చెక్క – 30 గ్రాములు
తేనె – 200 గ్రాములు
తాటి బెల్లం – 200 గ్రాములు
ఈ పదార్థాలను అన్నింటినీ.. మిక్సీలో వేసి బాగా రుబ్బాలి. పేస్ట్ లాగా చేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ ను తీసి ఓ గిన్నెలో వేసి.. వేడి చేయాలి. అది ముద్దగా మారేంత వరకు ఆ మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టాలి. అది ముద్దలా మారాక.. ఒక రోజు ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాత దాన్ని చింతగింజంత మోతాదులో కరోనా వచ్చిన వాళ్లు అయినా.. కరోనా రాని వాళ్లు అయినా రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఉదయం పరిగడుపున ఒకటి, సాయంత్రం అంటే రాత్రి భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు చింతగింజంత మోతాదులో తీసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ పది రోజులు గ్యాప్ ఇచ్చి ఒక రోజు మాత్రం రెండు సార్లు తీసుకోవాలి. దీంతో కరోనా ఉన్నవారికి నెగెటివ్ వస్తుంది. కరోనా లేనివారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ ఔషధాన్ని వాడే సమయంలో.. వాడిన తర్వాత కొన్ని రోజుల వరకు మాంసాహారం తినకూడదు. సిగిరెట్, మందు తాగకూడదు. పాన్, గుట్కాలు కూడా వేసుకోకూడదు. తంబాకు వాడకూడదు. చిన్నపిల్లలు, బాలింత స్త్రీలు, గర్భిణీలు, బహిష్టు వచ్చిన స్త్రీలు ఈ మందును వాడకూడదు.
గమనిక : ఈ కరోనా మందు తయారు చేసే విధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే.. ఇది అఫిషియల్ అయితే కాదు. అధికారికంగా ఆనందయ్య కానీ.. ప్రభుత్వం కానీ చెప్పలేదు. కాబట్టి.. ఈ మందును తయారు చేసుకోవాలనుకునే వాళ్లు ముందుగా ఆయుర్వదే నిపుణులను సంప్రదించి వాళ్ల సూచనలను తీసుకొని తయారు చేసుకోవాల్సిందిగా మనవి. ఈ మందు తయారు చేసే విధానానికి, thetelugunews వెబ్ సైట్ కు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి రీడర్స్ గమనించగలరు.
గమనిక : ఈ కరోనా మందు తయారు చేసే విధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే.. ఇది అఫిషియల్ అయితే కాదు. అధికారికంగా ఆనందయ్య కానీ.. ప్రభుత్వం కానీ చెప్పలేదు. కాబట్టి.. ఈ మందును తయారు చేసుకోవాలనుకునే వాళ్లు ముందుగా ఆయుర్వదే నిపుణులను సంప్రదించి వాళ్ల సూచనలను తీసుకొని తయారు చేసుకోవాల్సిందిగా మనవి. ఈ మందు తయారు చేసే విధానానికి, thetelugunews వెబ్ సైట్ కు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి రీడర్స్ గమనించగలరు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.