man kills wife on first day of marriage in krishna
పెళ్లి అనేది జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోయే రోజు. కానీ.. ఆ పెళ్లి అయిన రోజే.. ఆ జంట జీవితం ముగిసిపోతే ఎలా ఉంటుంది? వాళ్లకేమో కానీ.. వాళ్లను కన్న తల్లిదండ్రుల బాధ మాత్రం వర్ణణాతీతంగా ఉంటుంది. పెళ్లి అయిన రోజే.. కాళ్లకు పారాణి కూడా ఆరకముందే.. ఆ పెళ్లి కూతురు పాడె ఎక్కితే.. ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రుల ఏడుపును ఎవ్వరు ఆపగలరు చెప్పండి. పెళ్లి అయిన రోజును ఎంత అపురూపంగా భావిస్తాం. పెళ్లి అయిన సంవత్సరం తర్వాత వచ్చే మొదటి పెళ్లి రోజును కూడా ఎంతో పవిత్రంగా భావించి.. పెళ్లి వేడుకలు జరుపుకుంటాం. కానీ.. ఆ మెదటి పెళ్లి రోజునే ఆ జంటకు ఏదైనా జరిగితే ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
man kills wife on first day of marriage in krishna
జిల్లాలోని విస్సన్నపేటకు చెందిన కొర్ర దుర్గారావుకు గత సంవత్సరం లక్ష్మీ అనే యువతితో పెళ్లి జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకున్నా.. పెళ్లి తర్వాత వాళ్ల మధ్య చాలా గొడవలు వచ్చేవి. పెళ్లి అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ అవుతూనే ఉండేది. వాళ్ల పెళ్లి అయిన గత బుధవారానికి సరిగ్గా ఏడాది అవ్వడంతో.. మొదటి పెళ్లి రోజు వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్నారు.
మొదటి పెళ్లి రోజు కదా.. ఇద్దరు భార్యాభర్తలు కాస్త చనువుగా ఉన్నారు. అయితే.. రాత్రి పడక విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. మరోసారి ఇద్దరూ కాసేపు పోట్లాడుకున్నారు. అయితే.. వాళ్ల గొడవ ఆరోజు ఎక్కువైంది. రోజూ లాగే.. వీళ్లు గొడవ పడుతున్నారు కాబోలు అని స్థానికులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ.. వాళ్ల గొడవ పెరిగి పెద్దదయింది. దీంతో వెంటనే ఆవేశంతో.. దుర్గారావు.. లక్ష్మిని తీవ్రంగా కొట్టాడు. దీంతో.. తను అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే తేరుకున్న దుర్గారావు.. ఏమైందని తనను లేపి చూడగా.. అప్పటికే విగత జీవిగా పడి ఉంది. వెంటనే భయపడిపోయిన దుర్గారావు.. విస్సన్నపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి.. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే.. రంగంలోకి దిగిన పోలీసులు.. లక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి.. దుర్గారావును అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.