
Minister Roja dispute again in Srikalahasti
Roja : ఇటీవల ఏపి మంత్రులు వరుస వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. వారికి సంబందించి ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఎవరు లెక్కచేయడం లేదు. ఇటీవల మంత్రి రోజా తిరుమల కేంద్రంగా విమర్శలకు కారణమయ్యారు. రోజా 30 మంది అనుచరులతో కలిసి దర్శనానికి వెళ్లారు. అందులో పది మందికి టీటీడీ ప్రోటోకాల్ దర్శనం….మరో 20 మందికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. తనతో పాటుగా వచ్చిన అనుచరులు దర్శనం పూర్తి చేసుకొనే వరకూ మంత్రి రోజా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. మంత్రులతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఈ వివాదంపై చర్చలు నడుస్తున్న సమయంలో రోజా మరో వివాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది.
దక్షిణ కాశి క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.భూతనాధుడి ఆలయంలో ఆలయ అర్చకులు వెలిగించే దీపాలు మినహా.. భక్తులు దీపాలు వెంట తెచ్చుకోవద్దు . విఐపిల విషయంలో అందుకు బిన్నంగా ఈ ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజా చర్య తీవ్రవిమర్శలకు తావిస్తోంది. మంగళవారం నాడు రాహుకేతు సర్పదోష నివారణార్థం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చారు. ముక్కంటి దర్శనానికి ముందుగా మంత్రి రోజా సహస్రలింగేశ్వర సన్నిధి వద్ద రాహు కేతు దోష నివారణ పూజ నిర్వహించారు.
Minister Roja dispute again in Srikalahasti
దోష నివారణ పూజ అనంతరం స్వామి., అమ్మవార్లకు నిర్వహించే రుద్రాభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నిర్వహించే దీపారాధన పూజలో పాల్గొన్నారు. కాలభైరవ స్వామి వారికీ అభిషేకం చేయించారు. అభిషేక ఆరాధన జరుగుతున్న సమయంలో తన వెంట తెచ్చుకున్న గుమ్మడి కాయతో నేతి దీపాలు వెలిగించారు. అభిషేకం అయ్యే వరకు తనముందే దీపాలను ఉంచుకొని అభిషేకం అయ్యిన వెంటనే వాటిని అర్చకుల వద్దకు ఇచ్చి హారతి ఇవ్వమని చెప్పారు. దంతా ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఉన్న సమయంలోనే జరగటం విశేషం. ఇదంతా ఆలయ నిబంధనలకు విరుద్ధమైనా అన్నీ తెలిసిన మంత్రిగానీ, అధికారులు, అర్చకులు పట్టించుకోలేదు.దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
This website uses cookies.