Minister Roja dispute again in Srikalahasti
Roja : ఇటీవల ఏపి మంత్రులు వరుస వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. వారికి సంబందించి ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఎవరు లెక్కచేయడం లేదు. ఇటీవల మంత్రి రోజా తిరుమల కేంద్రంగా విమర్శలకు కారణమయ్యారు. రోజా 30 మంది అనుచరులతో కలిసి దర్శనానికి వెళ్లారు. అందులో పది మందికి టీటీడీ ప్రోటోకాల్ దర్శనం….మరో 20 మందికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. తనతో పాటుగా వచ్చిన అనుచరులు దర్శనం పూర్తి చేసుకొనే వరకూ మంత్రి రోజా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. మంత్రులతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఈ వివాదంపై చర్చలు నడుస్తున్న సమయంలో రోజా మరో వివాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది.
దక్షిణ కాశి క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.భూతనాధుడి ఆలయంలో ఆలయ అర్చకులు వెలిగించే దీపాలు మినహా.. భక్తులు దీపాలు వెంట తెచ్చుకోవద్దు . విఐపిల విషయంలో అందుకు బిన్నంగా ఈ ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజా చర్య తీవ్రవిమర్శలకు తావిస్తోంది. మంగళవారం నాడు రాహుకేతు సర్పదోష నివారణార్థం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చారు. ముక్కంటి దర్శనానికి ముందుగా మంత్రి రోజా సహస్రలింగేశ్వర సన్నిధి వద్ద రాహు కేతు దోష నివారణ పూజ నిర్వహించారు.
Minister Roja dispute again in Srikalahasti
దోష నివారణ పూజ అనంతరం స్వామి., అమ్మవార్లకు నిర్వహించే రుద్రాభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నిర్వహించే దీపారాధన పూజలో పాల్గొన్నారు. కాలభైరవ స్వామి వారికీ అభిషేకం చేయించారు. అభిషేక ఆరాధన జరుగుతున్న సమయంలో తన వెంట తెచ్చుకున్న గుమ్మడి కాయతో నేతి దీపాలు వెలిగించారు. అభిషేకం అయ్యే వరకు తనముందే దీపాలను ఉంచుకొని అభిషేకం అయ్యిన వెంటనే వాటిని అర్చకుల వద్దకు ఇచ్చి హారతి ఇవ్వమని చెప్పారు. దంతా ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఉన్న సమయంలోనే జరగటం విశేషం. ఇదంతా ఆలయ నిబంధనలకు విరుద్ధమైనా అన్నీ తెలిసిన మంత్రిగానీ, అధికారులు, అర్చకులు పట్టించుకోలేదు.దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
This website uses cookies.