Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. సీబీఐ విచారణ ముగిసినప్పటికీ.. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం నాడు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతోనూ మాట్లాడారు. సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసు ఆధారంగా తాను విచారణకు హాజరు అయినట్టు అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు.
అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్టు అవినాష్ రెడ్డి తెలిపారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తం చేసినట్టు అవినాష్ రెడ్డి చెప్పారు. ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని తాను సీబీఐ అధికారులకు చెప్పినట్టు అవినాష్ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాలని తాను సీబీఐ అధికారులను కోరానని, తన విచారణ సమయంలో వీడియో రికార్డు చేసి అది లైవ్ ప్రసారం చేయాలని సీబీఐ అధికారులను కోరానని.. కాని వాళ్లు ఒప్పుకోలేదని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయి.
సీబీఐ వాళ్లు ఎన్నిసార్లు నన్ను విచారణ చేసినా నాకేం భయం లేదు. నేనే తప్పు చేయలేదు.. అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారు. మీరు ఎప్పుడు పిలిచానా వస్తా అని చెప్పి వచ్చేశా అని సీబీఐ అధికారులకు చెప్పానని అవినాష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 248 మందిని సీబీఐ విచారించింది. వాళ్ల వాంగ్మూలాన్ని కూడా సేకరించింది. ఆ వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ.. అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించింది. నిజానికి వివేకా హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు మూడేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసు ఎటూ తేలలేదు. హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో సీబీఐ రంగంలోకి దిగి.. కేసుపై దర్యాప్తు చేస్తోంది.
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
This website uses cookies.