Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డి Vs సీబీఐలో భారీ ట్విస్ట్..!

Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. సీబీఐ విచారణ ముగిసినప్పటికీ.. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం నాడు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతోనూ మాట్లాడారు. సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసు ఆధారంగా తాను విచారణకు హాజరు అయినట్టు  అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు.

mp avinash reddy comments on cbi investigation

అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్టు అవినాష్ రెడ్డి తెలిపారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తం చేసినట్టు అవినాష్ రెడ్డి చెప్పారు. ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని తాను సీబీఐ అధికారులకు చెప్పినట్టు అవినాష్ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాలని తాను సీబీఐ అధికారులను కోరానని, తన విచారణ సమయంలో వీడియో రికార్డు చేసి అది లైవ్ ప్రసారం చేయాలని సీబీఐ అధికారులను కోరానని.. కాని వాళ్లు ఒప్పుకోలేదని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయి.

mp avinash reddy comments on cbi investigation

Avinash Reddy : కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని పత్రికలు

సీబీఐ వాళ్లు ఎన్నిసార్లు నన్ను విచారణ చేసినా నాకేం భయం లేదు. నేనే తప్పు చేయలేదు.. అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారు. మీరు ఎప్పుడు పిలిచానా వస్తా అని చెప్పి వచ్చేశా అని సీబీఐ అధికారులకు చెప్పానని అవినాష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 248 మందిని సీబీఐ విచారించింది. వాళ్ల వాంగ్మూలాన్ని కూడా సేకరించింది. ఆ వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ.. అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించింది. నిజానికి వివేకా హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు మూడేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసు ఎటూ తేలలేదు. హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో సీబీఐ రంగంలోకి దిగి.. కేసుపై దర్యాప్తు చేస్తోంది.

Recent Posts

Heavy Rain in Kamareddy : కామారెడ్డి వర్షబీభత్సం.. రేపు, ఎల్లుండి సెలవు

Heavy Rain in Kamareddy : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను…

27 minutes ago

Family Card : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు – చంద్రబాబు

Chandrababu - Family Card : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ కార్డు' జారీ…

1 hour ago

Ganesh Navaratri 2025 : తీరొక్క రూపాల్లో ఆశ్చర్యపరుస్తున్న గణపయ్య

Ganesh Navaratri : వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. వీధులు, మండపాలు రంగుల అలంకరణలతో, విద్యుత్…

2 hours ago

Hyderabad Beach : హైదరాబాద్ కు బీచ్ ను తీసుకరాబోతున్న సీఎం రేవంత్

Hyderabad Beach : హైదరాబాద్‌కు త్వరలోనే ఒక వినూత్నమైన ఆకర్షణ రాబోతుంది. నగర శివారులోని కొత్వాలగూడలో రూ. 225 కోట్ల…

3 hours ago

Best Phones | మీకు 20వేల లోపు కొత్త ఫోన్ కావాలా.. అయితే ఇవి చూడండి..!

Best Phones | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, గేమింగ్‌కు ఉపయోగపడే ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్,…

4 hours ago

Jio and Airtel | వ‌ర‌ద బాధితులకి సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చిన జియో, ఎయిర్‌టెల్

Jio and Airtel | తీవ్రమైన వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతున్న తరుణంలో, సంబంధిత ప్రాంతాల ప్రజలకు కమ్యూనికేషన్…

5 hours ago

Nivetha Pethuraj | గుట్టు చ‌ప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న హీరోయిన్.. ఫొటోలు వైర‌ల్

Nivetha Pethuraj | టాలీవుడ్‌లో తన సొగ‌సైన న‌ట‌న‌తో మంచి గుర్తింపు సంపాదించిన నటి నివేదా పేతురాజ్ తన అభిమానులకు…

6 hours ago

Mirai Trailer విడుద‌లైన తేజ సజ్జా మిరాయ్ ట్రైల‌ర్..దునియాలో ఏది నీది కాదు..

హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు కార్తీక్…

7 hours ago