ChandraBabu : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం నర సమయం కూడా లేదు. అందుకే ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ పార్టీలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారుతోంది. ఈనేపథ్యంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి అధికార వైసీపీని ఓడించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ల పొత్తులు కన్ఫమ్ అయినట్టే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి.. బీజేపీకి ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్.. బీజేపీకి కోపం తెప్పించే పనులు చాలానే చేస్తుంది.
ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.తాజాగా కాంగ్రెస్ అధినేత నుంచి టీడీపీకి ఆహ్వానం అందిందట. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడం కోసం కాంగ్రెస్ పలు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే.. టీడీపీకి కూడా ఆహ్వానం అందింది. సోమవారం నాడు శ్రీనగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ముగిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ముగింపు సభలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందిందట. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే టీడీపీతో పాటు 23 పార్టీలకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపటితో ముగియనుంది. శ్రీనగర్ లో ముగింపు సభ ఉంటుంది.
ఈ సభకు అందరూ రావాలని 21 పార్టీల చీఫ్ లకు ఖర్గే లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా లేఖ అందిందట. అలాగే.. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, నితీశ్ కుమార్, అఖిలేష్ యాదవ్, మాయావతి, హేమంత్ సోరెన్ కూడా లేఖ రాసిందట కాంగ్రెస్ పార్టీ. ఈనేపథ్యంలో చంద్రబాబు.. ఆ సభకు వెళ్తారా అనేది సస్పెన్సే. కానీ.. చంద్రబాబు ఈ సభకు వెళ్లకపోవచ్చు.. అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపడం వల్ల టీడీపీ భారీగా నష్టపోయిందని.. ఇంకోసారి ఆ తప్పు టీడీపీ చేయదని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.