Ys Jagan
ఏపీ ప్రభుత్వంకు రెడ్డి సామాజిక వర్గంతో సమస్య ఏంటా అనుకుంటున్నారా. సీఎం రెడ్డి అయినా కూడా నెల్లూరు రెడ్డి సామాజిక వర్గంకు న్యాయం దక్కడం లేదట. వారికి సరైన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వడం లేదట. దాంతో నెల్లూరు రెడ్లు చాలా కోపంతో ఉన్నారు. నెల్లూరులో ఉన్న ఇద్దరు ముఖ్య నాయకులు కూడా రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారే. వారు ఇద్దరు కూడా ప్రస్తుతం వైకాపా లో ఉంటున్నా కూడా జగన్ కు దూరంగా ఉంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో వారికి సంబంధించిన సహకారం చాలా అవసరం. కాని వారు మాత్రం దూరంగా ఉంటున్న కారణంగా ఉప ఎన్నికల్లో మెజార్టీకి భారీ గండి పడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నెల్లూరు లో మంత్రి పదవులు కావాలని ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఎలాంటి సానుకూల స్పందన దక్కలేదు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలో నెల్లూరు రెడ్డి సామాజిక వర్గంకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి మరియు కాకాని గోవర్ధన్ రెడ్డి కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ లు అయిన వీరిద్దరిపై అదే జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో ఆయన కు పోటీగా వీరు కూడా మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
Ys jagan
నెల్లూరు జిల్లాలోని కీలక నియోజక వర్గాలు తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. కనుక వాటి నుండి ఓట్లు జారిపోకుండా ఉండేందుకు గాను స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగాడు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలను వారికి చెప్పి ఎన్నికల్లో సహకరించాలని కోరాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా అండగా ఉంటాడు. జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా మీకు పదవులు ఇస్తాడని హామీ ఇచ్చాడట. మరి తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ రెడ్డి సామాజిక వర్గంకు చెందిన ఎమ్మెల్యేలు మరియు నాయకులు ఎంత వరకు సహకరిస్తారు అనేది చూడాలి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.