
no more chance for nayudu family in ap politics
Ap Politics : పాలిటిక్స్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత తెర మరుగైన కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఆదికేశవులు నాయుడు గారి ఫ్యామిలీ. డీకే దంపతులు భౌతికంగా దూరం కావటంతో వాళ్ల కుటుంబాన్ని పట్టించుకునే పార్టీలు కరువయ్యాయి. సొంత పార్టీ తెలుగుదేశం గానీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ గానీ ఆ ఫ్యామిలీని దగ్గరికి తీయట్లేదు. దీంతో ఆదికేశవులు నాయుడి వారసుడు డీకే శ్రీనివాస్ ప్రస్తుతం కుటుంబ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలకు క్రమంగా, శాశ్వతంగా దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ కథ కంచికి చేరినట్లేనని భావిస్తున్నారు. గత ఘన చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుంటున్నారు.
ఇప్పుడంటే విజయ్ మాల్యా ఒక ఆర్థిక నేరస్థుడు గానీ గతంలో ఆయన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి పెద్ద పారిశ్రామికవేత్తకే డీకే ఆదికేశవులు నాయుడిని వ్యాపార గురువుగా పేర్కొనేవారు. డీకేకి ఆరోజుల్లో ఆ స్థాయిలో పలుకుబడి ఉండేది. లిక్కర్, రియల్ ఎస్టేట్, విద్య తదితర రంగాల్లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. మొదట్లో కర్ణాటక రాజకీయాల్లోకి ప్రవేశించిన డీకే తర్వాత ఏపీ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. టీడీపీలో చిత్తూరు జిల్లా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎంపీ అయ్యారు. అదే క్రమంలో పవర్ ఫుల్ టెంపుల్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవీ ఆయన్ని వరించింది. అనంతరం డీకే సతీమణి సత్యప్రభ సైతం ఒక సారి ఎన్నికల్లో నెగ్గారు. అయితే వాళ్లిద్దరూ ఇప్పుడు మన మధ్య లేరు. ఆ లోటు ప్రభావం వాళ్ల కుమారుడిపై బాగా పడుతోంది.
no more chance for nayudu family in ap politics
డీకే శ్రీనివాస్ ని గత అసెంట్లీ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయిద్దామని అనుకున్నా చంద్రబాబు నాయుడి సలహాలు, ఆదేశాల ప్రకారం వెనక్కి తగ్గారని చెబుతారు. ఆ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో డీకే శ్రీనివాస్ జగన్ పార్టీ వైపు మొగ్గు చూపాడు. ఒకసారి ముఖ్యమంత్రిని కలిశారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నుంచి ఇప్పటివరకూ పిలుపు రాలేదు. ఫలితంగా శ్రీనివాస్ తన వ్యాపారాలేవో తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పటికైనా అతణ్ని ఏ పార్టీ అయినా గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి. లేకపోతే డీకే కుటుంబ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అని డిసైడ్ కావాల్సిందే.
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
This website uses cookies.