
no more chance for nayudu family in ap politics
Ap Politics : పాలిటిక్స్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత తెర మరుగైన కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఆదికేశవులు నాయుడు గారి ఫ్యామిలీ. డీకే దంపతులు భౌతికంగా దూరం కావటంతో వాళ్ల కుటుంబాన్ని పట్టించుకునే పార్టీలు కరువయ్యాయి. సొంత పార్టీ తెలుగుదేశం గానీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ గానీ ఆ ఫ్యామిలీని దగ్గరికి తీయట్లేదు. దీంతో ఆదికేశవులు నాయుడి వారసుడు డీకే శ్రీనివాస్ ప్రస్తుతం కుటుంబ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలకు క్రమంగా, శాశ్వతంగా దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ కథ కంచికి చేరినట్లేనని భావిస్తున్నారు. గత ఘన చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుంటున్నారు.
ఇప్పుడంటే విజయ్ మాల్యా ఒక ఆర్థిక నేరస్థుడు గానీ గతంలో ఆయన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి పెద్ద పారిశ్రామికవేత్తకే డీకే ఆదికేశవులు నాయుడిని వ్యాపార గురువుగా పేర్కొనేవారు. డీకేకి ఆరోజుల్లో ఆ స్థాయిలో పలుకుబడి ఉండేది. లిక్కర్, రియల్ ఎస్టేట్, విద్య తదితర రంగాల్లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. మొదట్లో కర్ణాటక రాజకీయాల్లోకి ప్రవేశించిన డీకే తర్వాత ఏపీ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. టీడీపీలో చిత్తూరు జిల్లా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎంపీ అయ్యారు. అదే క్రమంలో పవర్ ఫుల్ టెంపుల్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవీ ఆయన్ని వరించింది. అనంతరం డీకే సతీమణి సత్యప్రభ సైతం ఒక సారి ఎన్నికల్లో నెగ్గారు. అయితే వాళ్లిద్దరూ ఇప్పుడు మన మధ్య లేరు. ఆ లోటు ప్రభావం వాళ్ల కుమారుడిపై బాగా పడుతోంది.
no more chance for nayudu family in ap politics
డీకే శ్రీనివాస్ ని గత అసెంట్లీ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయిద్దామని అనుకున్నా చంద్రబాబు నాయుడి సలహాలు, ఆదేశాల ప్రకారం వెనక్కి తగ్గారని చెబుతారు. ఆ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో డీకే శ్రీనివాస్ జగన్ పార్టీ వైపు మొగ్గు చూపాడు. ఒకసారి ముఖ్యమంత్రిని కలిశారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నుంచి ఇప్పటివరకూ పిలుపు రాలేదు. ఫలితంగా శ్రీనివాస్ తన వ్యాపారాలేవో తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పటికైనా అతణ్ని ఏ పార్టీ అయినా గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి. లేకపోతే డీకే కుటుంబ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అని డిసైడ్ కావాల్సిందే.
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
This website uses cookies.