Ap Politics : నాయుడు గారి కుటుంబానికి.. ఏపీ రాజకీయాల్లో ఎండ్ కార్డే(నా)?.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ap Politics : నాయుడు గారి కుటుంబానికి.. ఏపీ రాజకీయాల్లో ఎండ్ కార్డే(నా)?..

 Authored By kondalrao | The Telugu News | Updated on :7 June 2021,9:32 am

Ap Politics : పాలిటిక్స్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత తెర మరుగైన కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఆదికేశవులు నాయుడు గారి ఫ్యామిలీ. డీకే దంపతులు భౌతికంగా దూరం కావటంతో వాళ్ల కుటుంబాన్ని పట్టించుకునే పార్టీలు కరువయ్యాయి. సొంత పార్టీ తెలుగుదేశం గానీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ గానీ ఆ ఫ్యామిలీని దగ్గరికి తీయట్లేదు. దీంతో ఆదికేశవులు నాయుడి వారసుడు డీకే శ్రీనివాస్ ప్రస్తుతం కుటుంబ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలకు క్రమంగా, శాశ్వతంగా దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ కథ కంచికి చేరినట్లేనని భావిస్తున్నారు. గత ఘన చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుంటున్నారు.

విజయ్ మాల్యాకే..

ఇప్పుడంటే విజయ్ మాల్యా ఒక ఆర్థిక నేరస్థుడు గానీ గతంలో ఆయన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి పెద్ద పారిశ్రామికవేత్తకే డీకే ఆదికేశవులు నాయుడిని వ్యాపార గురువుగా పేర్కొనేవారు. డీకేకి ఆరోజుల్లో ఆ స్థాయిలో పలుకుబడి ఉండేది. లిక్కర్, రియల్ ఎస్టేట్, విద్య తదితర రంగాల్లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. మొదట్లో కర్ణాటక రాజకీయాల్లోకి ప్రవేశించిన డీకే తర్వాత ఏపీ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. టీడీపీలో చిత్తూరు జిల్లా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎంపీ అయ్యారు. అదే క్రమంలో పవర్ ఫుల్ టెంపుల్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవీ ఆయన్ని వరించింది. అనంతరం డీకే సతీమణి సత్యప్రభ సైతం ఒక సారి ఎన్నికల్లో నెగ్గారు. అయితే వాళ్లిద్దరూ ఇప్పుడు మన మధ్య లేరు. ఆ లోటు ప్రభావం వాళ్ల కుమారుడిపై బాగా పడుతోంది.

no more chance for nayudu family in ap politics

no more chance for nayudu family in ap politics

2019లో కుదరలే : Ap Politics

డీకే శ్రీనివాస్ ని గత అసెంట్లీ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయిద్దామని అనుకున్నా చంద్రబాబు నాయుడి సలహాలు, ఆదేశాల ప్రకారం వెనక్కి తగ్గారని చెబుతారు. ఆ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో డీకే శ్రీనివాస్ జగన్ పార్టీ వైపు మొగ్గు చూపాడు. ఒకసారి ముఖ్యమంత్రిని కలిశారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నుంచి ఇప్పటివరకూ పిలుపు రాలేదు. ఫలితంగా శ్రీనివాస్ తన వ్యాపారాలేవో తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పటికైనా అతణ్ని ఏ పార్టీ అయినా గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి. లేకపోతే డీకే కుటుంబ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అని డిసైడ్ కావాల్సిందే.

ఇది కూడా చ‌ద‌వండి ==> Jr.NTR : కుప్పంలో బాబుకు షాక్.. జూ.ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు అంటూ..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : వైఎస్ జ‌గ‌న్‌ వాళ్ల‌కి బంగారం లాంటి ఛాన్స్ ఇచ్చినా..!

ఇది కూడా చ‌ద‌వండి ==> YSRCP : నక్క తోక తొక్కి వచ్చాడా.. వైసీపీలో ఆ సీనియర్ నేతకు పట్టిందల్లా బంగారమే?

ఇది కూడా చ‌ద‌వండి ==>b వైర‌ల్ వీడియో .. మాట్లాడుతున్న వింత పాము..!

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది