
Banana powder business give best income
PM Kisan E-KYC : కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో ఒకటే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2000 చొప్పున ఏటా రూ.6,000 రైతులకు అందిస్తుంది. అయితే ఈ పథకం కింద 6,000 మీ ఎకౌంట్ లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ- కేవైసీ చేయించుకోవాలి. ఈనెల 31 వ తారీఖు లోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే ఈ పథకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ-కేవైసీ, కేవైసీ రెండు విధానాలు వేరు వేరు. ఓటిపి ఆధారంగా చేసే విధానాన్ని ఈ-కేవైసీ అంటారు. ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ తో ఈ-కేవైసీ ని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీ ని డాక్యుమెంట్లు ఆధారంగా పూర్తి చేశారు.
అయితే ఇంతకుముందే కేవైసీ చేయించిన పిఎం కిసాన్ లబ్ధిదారులు మళ్లీ ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్బిఐ ఆదేశాల ప్రకారం మనీ లాండరింగ్, ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని అమలుపరిచారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. దీంతో ప్రజలకు చెందాల్సిన ధనం ఆదా అవుతుంది. ఈ-కేవైసీ ని స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా www.pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ ఫోన్ కు ఓటిపి వస్తుంది. వెబ్ సైట్ లో ఎంటర్ చేయగానే గెట్ పిఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్ కు వచ్చిన ఓటీపీని దాంట్లో నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ అప్డేట్ అవుతుంది. ఈ-కేవైసీని కస్టమర్ సర్వీస్ సెంటర్లలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు.
PM Kisan E-KYC scheme central government provides Rs.6,000 to farmers annually at the rate of Rs.2,000
జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లలో రైతుల సౌకర్యార్థం ఈ-కేవైసీ చేస్తున్నారు అలాగే ఆన్లైన్ కేంద్రాలు, మీసేవ కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈనెల 31 వ తారీఖు లోపు రైతులు చేసుకోవాలి. లేదంటే ఈ పథకాన్ని కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ఈ – కేవైసీ నమోదుకు గడువు పొడిగిస్తూ వచ్చింది. ఇదే చివరి అవకాశం కావడంతో రైతులను ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చైతన్య పరుస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.2,000 చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6,000 రైతులకు అందుతున్నాయి. అర్హత ఉన్న ప్రతి రైతు ఆధార్ దానికి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ అలాగే ఓటీపీ నెంబర్ ఆధారంగా చేసుకోవాలి. రైతులు ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా ఈ-కేవైసీ చేయించుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
This website uses cookies.