Categories: News

PM Kisan E-KYC : ఇదే చివరి అవకాశం… ఇలా చేయండి లేదంటే డబ్బులు పోతాయి…

PM Kisan E-KYC : కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో ఒకటే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2000 చొప్పున ఏటా రూ.6,000 రైతులకు అందిస్తుంది. అయితే ఈ పథకం కింద 6,000 మీ ఎకౌంట్ లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ- కేవైసీ చేయించుకోవాలి. ఈనెల 31 వ తారీఖు లోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే ఈ పథకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ-కేవైసీ, కేవైసీ రెండు విధానాలు వేరు వేరు. ఓటిపి ఆధారంగా చేసే విధానాన్ని ఈ-కేవైసీ అంటారు. ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ తో ఈ-కేవైసీ ని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీ ని డాక్యుమెంట్లు ఆధారంగా పూర్తి చేశారు.

అయితే ఇంతకుముందే కేవైసీ చేయించిన పిఎం కిసాన్ లబ్ధిదారులు మళ్లీ ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్బిఐ ఆదేశాల ప్రకారం మనీ లాండరింగ్, ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని అమలుపరిచారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. దీంతో ప్రజలకు చెందాల్సిన ధనం ఆదా అవుతుంది. ఈ-కేవైసీ ని స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా www.pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ ఫోన్ కు ఓటిపి వస్తుంది. వెబ్ సైట్ లో ఎంటర్ చేయగానే గెట్ పిఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్ కు వచ్చిన ఓటీపీని దాంట్లో నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ అప్డేట్ అవుతుంది. ఈ-కేవైసీని కస్టమర్ సర్వీస్ సెంటర్లలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు.

PM Kisan E-KYC scheme central government provides Rs.6,000 to farmers annually at the rate of Rs.2,000

జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లలో రైతుల సౌకర్యార్థం ఈ-కేవైసీ చేస్తున్నారు అలాగే ఆన్లైన్ కేంద్రాలు, మీసేవ కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈనెల 31 వ తారీఖు లోపు రైతులు చేసుకోవాలి. లేదంటే ఈ పథకాన్ని కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ఈ – కేవైసీ నమోదుకు గడువు పొడిగిస్తూ వచ్చింది. ఇదే చివరి అవకాశం కావడంతో రైతులను ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చైతన్య పరుస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.2,000 చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6,000 రైతులకు అందుతున్నాయి. అర్హత ఉన్న ప్రతి రైతు ఆధార్ దానికి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ అలాగే ఓటీపీ నెంబర్ ఆధారంగా చేసుకోవాలి. రైతులు ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా ఈ-కేవైసీ చేయించుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.

Recent Posts

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

6 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

7 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

8 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

9 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

9 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

11 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

12 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

13 hours ago