
prashant kishor to work with ys sharmila party in telangana
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్దే పూర్తి ఆధిపత్యం. మధ్య మధ్యలో ఇతర పార్టీలు కొంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్దే పైచేయి అని చెప్పకతప్పదు. తెలంగాణలో వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్.. రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొంతమేర బలపడ్డ బీజేపీ, కాంగ్రెస్ కూడా అధికారం కోసం రేసులో నిలిచాయి. ఇక తీన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్ షర్మిల కూడా రాజ్యాధికారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కేసీఆర్ను దెబ్బకొట్టడం అంత ఈజీ కాదనే వాదన ఉంది. ఇందుకోసం కేసీఆర్ను మించి వ్యూహాత్మకంగా ఆలోచించే వ్యూహకర్త కావాలన్నది పలువురి అభిప్రాయం. ఇదిలా ఉంటే ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టేలా వ్యూహాలు రచించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. త్వరలోనే తెలంగాణపై ఫోకస్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన వైఎస్ షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించనున్నారని ప్రచారం సాగుతోంది.
prashant kishor to work with ys sharmila party in telangana
ఇందుకోసం ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కసరత్తు పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే హైదరాబాద్కు వచ్చి పని మొదలుపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర కోసం వైఎస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, ఫలితం దక్కడం లేదు..అందుకే ఇక అన్న వైఎస్ జగన్ బాటలో నడవాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్నపాలన తెస్తామంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. త్వరలోనే పాదయాత్ర చేయడానికి కూడా
సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు వైఎస్ షర్మిలకు ఆశించిన స్థాయిలో పొలిటికల్ మైలేజీ వచ్చిన దాఖలాలు మాత్రం పెద్దగా లేవనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి తెలంగాణలో వైఎస్ షర్మిల సారథ్యంలో వైఎస్ఆర్టీపీని రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా మార్చనున్నారన్న టాక్ ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిశోర్ ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్.. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అధికార చేజిక్కించుకునేందుకు దోహదం చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ప్రశాంత్ కిశోర్ వైఎస్ షర్మిల పార్టీ కోసం పని చేస్తే.. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.