Categories: NewspoliticsTelangana

YS Sharmila : 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి వైఎస్ షర్మిల.. వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ నియామకం?

Advertisement
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌దే పూర్తి ఆధిపత్యం. మధ్య మధ్యలో ఇతర పార్టీలు కొంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌దే పైచేయి అని చెప్పకతప్పదు. తెలంగాణలో వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్.. రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొంతమేర బలపడ్డ బీజేపీ, కాంగ్రెస్ కూడా అధికారం కోసం రేసులో నిలిచాయి. ఇక తీన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్ షర్మిల కూడా రాజ్యాధికారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కేసీఆర్‌ను దెబ్బకొట్టడం అంత ఈజీ కాదనే వాదన ఉంది. ఇందుకోసం కేసీఆర్‌ను మించి వ్యూహాత్మకంగా ఆలోచించే వ్యూహకర్త కావాలన్నది పలువురి అభిప్రాయం. ఇదిలా ఉంటే ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టేలా వ్యూహాలు రచించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. త్వరలోనే తెలంగాణపై ఫోకస్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన వైఎస్ షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించనున్నారని ప్రచారం సాగుతోంది.

Advertisement

prashant kishor to work with ys sharmila party in telangana

వైఎస్ షర్మిల కోసం..

ఇందుకోసం ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కసరత్తు పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చి పని మొదలుపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర కోసం వైఎస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, ఫలితం దక్కడం లేదు..అందుకే ఇక అన్న వైఎస్ జగన్ బాటలో నడవాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్నపాలన తెస్తామంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. త్వరలోనే పాదయాత్ర చేయడానికి కూడా
సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు వైఎస్ షర్మిలకు ఆశించిన స్థాయిలో పొలిటికల్ మైలేజీ వచ్చిన దాఖలాలు మాత్రం పెద్దగా లేవనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి తెలంగాణలో వైఎస్ షర్మిల సారథ్యంలో వైఎస్ఆర్‌టీపీని రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా మార్చనున్నారన్న టాక్ ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిశోర్ ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్.. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అధికార చేజిక్కించుకునేందుకు దోహదం చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ప్రశాంత్ కిశోర్ వైఎస్ షర్మిల పార్టీ కోసం పని చేస్తే.. తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement

Recent Posts

Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించ‌నున్న‌ జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?

Ys Jagan  : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…

1 hour ago

Ram Charan Upasana Twins Names : రామ్ చరణ్ ఉపాసన పిల్లల ‘శివరాం’ , ‘అన్వీరా దేవి’.. పేర్లకు అర్ధాలు తెలుసా..?

Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…

2 hours ago

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌…

3 hours ago

Telangana Municipal Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తో గెలిచిన అభ్యర్థులు వీరే !!

Telangana Municipal Results 2026  : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర…

4 hours ago

AP Govt Good News : కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Govt Good news to New Pensions : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల అంశంపై శాసనమండలి వేదికగా ప్రభుత్వం మరియు…

5 hours ago

Telangana Municipal Polls 2026 : మున్సిపల్ పోరులో ‘హస్తం’ ప్రభంజనం

Telangana Municipal Polls 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని…

5 hours ago

Rajya Sabha : ఏపీ నుండి రాజస్యభకు వెళ్లే ఎంపీలు వీరేనా ?

Rajya Sabha  : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…

7 hours ago

Fruits : ఈ పండ్లు అతిగా తింటే ఆమ్లత్వం పెరుగుతుందా? .. వాటిని ఎందుకు తినకూడదో తెలుసా ..!

Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…

8 hours ago