
rbi brings new changes in online transactions
RBI : ఆన్లైన్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక మార్పులు చేసింది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతంలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకురాగా.. రాబోయే సంవత్సరం ప్రారంభం నుంచి వినియోగదారులు తాజా మార్పులకు అనుగుణంగా ట్రాన్సాక్షన్లు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా మార్గదర్శకాల ప్రకారం.. జనవరి 1 నుంచి ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లలో వినియోగదారులు తమ కార్డు వివరాలను సేవ్ చేయడానికి వీలులేదు. ఆన్లైన్ లావాదేవీ జరిపిన ప్రతీసారి తమ కార్డు వివరాలను కస్టమర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇబ్బందిగా ఉందనుకుంటే.. తమ కార్డులను టోకనైజ్ చేయాల్సి ఉంటుందని అందుకు ఈ-కామర్స్ సంస్థలకు సంబంధిత కస్టమర్లు అంగీకారం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.
rbi brings new changes in online transactions
ఈ మేరకు వినియోగదారులు కొత్త ఏడాది ప్రారంభం నుంచి జరిపే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో కార్డు, వ్యక్తిగత వివరాలు, సీవీపీ నెంబర్ను ఎంటర్ చేసే పనిలేకుండా టోకనైజేషన్ వ్యవస్థను ఆర్బీఐ అందుబాటులోకి తెస్తోంది. కస్టమర్ల డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండేందుకే ఈ టోకనైజేషన్ అనే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కస్టమర్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి తన వ్యక్తిగత, కార్డ్ వివరాలు, సీవీవీ నెంబర్లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు.
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
This website uses cookies.