RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

 Authored By suma | The Telugu News | Updated on :28 January 2026,8:00 pm

ప్రధానాంశాలు:

  •  RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌... వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో ఆదాయం నిలిచిపోవడం, ఉపాధి కోల్పోవడం సాధారణమే. అలాంటి కష్టకాలంలో రుణాల భారం మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రుణగ్రహీతలకు గణనీయమైన ఉపశమనం కల్పించేలా కొత్త ‘డిజాస్టర్ రిలీఫ్’ మార్గదర్శకాలను విడుదల చేసింది. విపత్తుల ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో ఉన్నవారు తక్షణంగా లోన్ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

RBI రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌ వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు RBI కొత్త మార్గదర్శకాలు ఇవే

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : విపత్తుల సమయంలో రుణగ్రహీతలకు లభించే ప్రధాన సడలింపులు

ఆర్‌బీఐ రూపొందించిన ఈ కొత్త నిబంధనల వల్ల రుణాలు తీసుకున్న వారికి నాలుగు రకాలుగా లాభం చేకూరనుంది. మొదటగా లోన్ రీస్ట్రక్చరింగ్ అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆదాయం తగ్గినా లేదా పూర్తిగా కోల్పోయినా పాత లోన్ల చెల్లింపు గడువును పెంచుకోవచ్చు. ఈఎంఐలను కొత్తగా రీషెడ్యూల్ చేసుకునే వీలుంటుంది. దీనివల్ల తక్షణమే చెల్లించలేకపోయినా డిఫాల్టర్‌గా పరిగణించరు. రెండవది మోరటోరియం సౌకర్యం. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు కొన్ని నెలల పాటు అసలు వడ్డీ చెల్లింపులపై విరామం ఇవ్వవచ్చు. మోరటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మూడవది అదనపు రుణాల మంజూరు. వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడానికి వ్యవసాయ పనులు కొనసాగించడానికి ఫ్రెష్ లోన్స్ లేదా అదనపు క్రెడిట్ సదుపాయాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. నాలుగవది తక్కువ వడ్డీ రేట్లు. విపత్తుల సమయంలో ఇచ్చే సహాయక రుణాలపై వడ్డీ భారం తగ్గేలా బ్యాంకులను ప్రోత్సహిస్తోంది.

RBI : బ్యాంకులపై ఆర్‌బీఐ బాధ్యతలు

కేవలం మార్గదర్శకాలు ప్రకటించడం మాత్రమే కాకుండా అవి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ఆర్‌బీఐ పక్కా ప్రణాళిక రూపొందించింది. ప్రతి జిల్లాలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. విపత్తు సంభవించిన వెంటనే ఈ కమిటీలు జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తాయి. అక్కడి రుణగ్రహీతలకు ఏయే సడలింపులు ఇవ్వాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాయి. నష్టం జరిగిన 3 నుంచి 6 నెలలలోపు రుణ పునర్వ్యవస్థీకరణ, క్లెయిమ్‌ల ప్రక్రియ పూర్తిచేయాలని బ్యాంకులకు గడువు విధించింది.

RBI : సామాన్యులకు ఎంతవరకు మేలు?

ప్రకృతి వైపరీత్యాలు ఎవరి నియంత్రణలో ఉండవు. అలాంటి వేళ రుణాలు చెల్లించలేదని బ్యాంకులు ఒత్తిడి తేవడం మానవతా దృక్పథానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం చిన్న వ్యాపారులు, రైతులు, గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా పెద్ద ఊరటగా మారనుంది. కష్టకాలంలో అప్పుల భారం కొంత తగ్గి మళ్లీ నిలబడేందుకు అవకాశం కల్పించడమే ఈ డిజాస్టర్ రిలీఫ్ మార్గదర్శకాల అసలు ఉద్దేశ్యం. విపత్తుల సమయంలో రుణగ్రహీతలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఆర్‌బీఐ తీసుకున్న ఈ అడుగు ప్రశంసనీయం అని చెప్పాలి.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది