
Revanth Reddy Was Sidelined
Revanth Reddy : టీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీలు డ్రామాలు ఆడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ మరియు బీజేపీలు రెండు స్నేహ పార్టీలు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎదుగుదలను తట్టుకోలేక ఆ రెండు పార్టీలు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నాయని అంటున్నారు. బీజేపీని కావాలని సీఎం కేసీఆర్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కూడా డ్రామాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లుగా నటిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించాడు.
బీజేపీకి చెందిన పలువురు కేంద్ర నాయకులు మరియు ఇతర రాష్ట్రాల నాయకులు క్యూ కట్టాల్సినంత పని ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది. కేవలం ప్రజల దృష్టిలో మేము టీఆర్ఎస్ కు పోటీగా ఉద్యమాలు చేస్తున్నాం. మేము తప్ప టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదు అన్నట్లుగా నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని తెలంగాణ ప్రజలు అంత అమాయకులు ఏమీ కాదు. వారు ఏం జరుగుతుంది అనే విషయాలను క్లీయర్ గా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క వర్గం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉన్నారు. కనుక ఎన్ని డ్రామాలు చేసినా కూడా మిమ్ములను నమ్మరు అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశాడు.
revanth reddy about trs and bjp fighting
బీజేపీ మరియు టీఆర్ఎస్ లు ఇక్కడ మాటలు మాట్లాడటం కాదు.. రెండు పార్టీలు ఇక్కడ కొట్టాడటం కాదు. దమ్ముంటే యూపీలో రేపు జరుగబోతున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాటం చేయాలి. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏ పార్టీకి అయినా మద్దతుగా అక్కడ ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. అప్పుడు టీఆర్ఎస్ మరియు బీజేపీలు రెండు కూడా మిత్ర పక్షం కాదు అని నమ్ముతాము అన్నట్లుగా రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీన పర్చేందుకు టీఆర్ఎస్ మరియు బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయి తప్ప రెండు పార్టీలు చిత్త శుద్దితో ఒకరిపై ఒకరు పోరాటం చేయడం లేదు అన్నట్లుగా రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. రెండు పార్టీలు ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా కలుస్తాయి అన్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కేంద్రంలో కూడా బీజేపీకి మద్దతుగా నిలిచే విధంగా కూటమిని ఏర్పాటు చేస్తున్నాడు తప్ప మోడీకి వ్యతిరేకంగా మాత్రం ఆయన కూటమికి ప్రయత్నాలు చేయడం లేదు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించాడు. కేసీఆర్ మాయ మాటలను నమ్మే రోజులు పోయాయి. జనాలు అన్ని చూస్తున్నారని అన్నాడు.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
This website uses cookies.