somu veerraju fires on chandrababu naidu
Chandrababu : మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్న సమయం లో రైతులను పట్టించుకోలేదని, అలాగే పలు రంగాలను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ ఆరోపించారు. గుంటూరు జిల్లా ఇంకా పలు జిల్లాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ ఆయన తెలియజేశారు.
గుంటూరు జిల్లాలో జరిగిన రైతు సభలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. మిర్చి పంట వేసిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆర్థికపరమైన అన్యాయాలను చేశారు. ఆయన ఉద్యోగాలను అమ్ముకోవడం మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.
somu veerraju fires on chandrababu naidu
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే ఆ సబ్ స్టేషన్ లో ఉన్న ఉద్యోగాలను చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడు అంటూ సోము వీర్రాజు ఆరోపించాడు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, కానీ ఈసారి ఏపీలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని కచ్చితంగా తెలుగు దేశం పార్టీకి మరోసారి చుక్కెదురు తప్పదంటూ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
This website uses cookies.