TDP : 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. కానీ, 2019 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ, జనసేనలతో పొత్తులో లేకుండా ఒంటరిగానే బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అలా ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన టీడీపీ ప్రస్తుతం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది.టీడీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ వేసుకుని మరి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే, బీజేపీలోని ఓ వర్గం మాత్రం టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవడం లేదని,అందుకే ఇటీవల ఢిల్లీలో బీజేపీ ఏపీ వ్యవహారాలు చేసుకునే ఇన్చార్జి, సీనియర్ నేత సునీల్ దేవధర్ మీడియా సమావేశం పెట్టి మరి టీడీపీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో టీడీపీ బీజేపీ పొత్తు గురించి ఆసక్తి కర చర్చ జరుగుతున్నది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ టీడీపీ అప్పుడే పొత్తుల గురించి ఆలోచన చేస్తుందా? అని అనుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులో ఉండి కొన్ని స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు మళ్లీ ఆనాటి పొత్తు కాంబినేషన్ అనగా టీడీపీ-బీజేపీ-జనసేన తెరమీదకు వస్తుందేమోననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, బీజేపీని పొత్తుకు ఒప్పిస్తే జనసేన ఆటోమేటిక్గా పొత్తులో భాగస్వామి అవుతుందనే వాదన కూడా వినబడుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు చివరి నిమిషం వరకు పొత్తుకు ప్రయత్నిస్తారని పలువురు అనుకుంటున్నారు.అయితే, చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే, రాష్ట్రనాయకత్వం సలహా, సంప్రదింపులు లేకుండానే బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకు భవిష్యత్తులో సై ..అంటుందా చూడాలి మరి..
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.